వరదసాయం పంపిణీలో భారీ దోపిడీ: లక్ష్మణ్
అధికార తెరాస గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.
హైదరాబాద్: అధికార తెరాస గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఆదివారం మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన తెరాస అభివృద్ధిపై దృష్టి సారించలేదని వ్యాఖ్యానించారు. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్లో వరద, బురద పేరుకుపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగ కల్పనలో వెనుకబడిన ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందించలేదన్నారు. తెరాస, మజ్లిస్ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కరోనా కష్టకాలంలో ప్రజలను ప్రభుత్వం ఆదుకోలేదని లక్ష్మణ్ విమర్శించారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు కొమ్ముకాసి పేదలను దోచుకున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా బాధితులకు ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షలు ఇస్తామంటే తెరాస ప్రభుత్వం అడ్డుపడిందని లక్ష్మణ్ వెల్లడించారు. దుబ్బాకలో విజయం తర్వాత భాజపా మరింత దూసుకుపోతుందనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ఎన్నికలను ముందుకు తీసుకొచ్చారని ఆయన అన్నారు. తాజా గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అనేక ప్రలోభాలకు పాల్పడినట్లు లక్ష్మణ్ ఆరోపించారు. వరద సాయం పంపిణీలో పెద్దఎత్తున దోపిడీ జరిగిందని ఆయన అన్నారు. అధికార పార్టీతో పోరాటం చేసి గ్రేటర్లో భాజపా సాధించిన విజయాన్ని చూసి తెరాసకు కళ్లు చెదిరిపోతున్నాయని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!