ముఖ్యమంత్రే కంగనకు పరిహారం ఇవ్వాలి: భాజపా
కక్ష సాధించేందుకే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బంగ్లాను కూల్చివేశారంటూ బాంబే హై కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ శుక్రవారం భాజపా మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది.
ముంబయి: కక్ష సాధింపులో భాగంగానే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బంగ్లాను కూల్చివేశారంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ భాజపా మహారాష్ట్ర సర్కార్పై విమర్శలకు దిగింది. ‘కంగన ఇంటిని కూల్చివేయడం దరుద్దేశపూరితంగా జరిగింది. ఆమెకు చెల్లించాల్సిన పరిహారం గురించి కోర్టు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు తగ్గట్టుగా బీఎంసీ నడుచుకుంది. ఈ సమస్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలి. ఆమెకు, బీఎంసీ న్యాయవాదులకు చెల్లించే సొమ్మును మొత్తం ముఖ్యమంత్రే చెల్లించాలి. ఆ సొమ్ము ప్రజలది కాకూడదు’ అంటూ భాజపా నేత అతుల్ భత్కాల్కర్ వ్యాఖ్యానించారు.
కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి నేపథ్యంలో కంగనా రనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ముదిరిన మాటల వివాదం..ఆమె బంగ్లా కూల్చివేతకు దారితీసిన విషయం తెలిసిందే. బీఎంసీ చర్యను ఖండిస్తూ ఆమె కోర్టును ఆశ్రయించగా.. నేడు కంగనకు అనుకూలంగా తీర్పు వెలువడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష