ఎంపీల్యాడ్స్ను పునరుద్ధరించండి
దేశ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎంపీల వేతనాల్లో కోతకు సంబంధించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. గత సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగా.. మంగళవారం దీనికి సభ ఆమోదం లభించింది. ఇవాళ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రాజ్యసభలో ప్రవేశపెట్టారు...
దిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న విపత్కర పరిస్థితుల్లో ఎంపీల వేతనాల్లో కోతకు సంబంధించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. గత సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగా.. మంగళవారం దీనికి సభ ఆమోదం లభించింది. పాత కొత్త బిల్లులను శుక్రవారం పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిలు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. తాజా బిల్లులతో ఏడాది పాటు కేంద్ర మంత్రులు, ఎంపీల జీతాల్లో 30 శాతం కోతపడనుంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు ఎంపీల్యాడ్స్ కూడా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇవాళ పలువురు పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంపీలు స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన ఈ నిధులను నిలిపి వేయడం తగదని, వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ వేతనాల కోతకు సంబంధించిన బిల్లులను వ్యతిరేకించారు. ఎంపీల్లో చాలా మంది జీతం మీదే ఆధారపడి ఉన్నారని, వాళ్ల జీతాల్లో 30 శాతం కోత విధించడం సమంజసం కాదని సభకు తెలిపారు. మరోవైపు ఎంపీల్యాడ్స్ను రద్దు చేయడంపైనా ఆయన విమర్శలు చేశారు. ఇవి ప్రజలకు సంబంధించిన నిధులని, మరీ అవసరమనుకుంటే రెండేళ్ల రద్దు వ్యవధిని తగ్గించాలని కోరారు. ఎంపీల జీతాల్లో కోత విధించే బదులు, ఆ మొత్తాన్ని సభకు అంతరాయం కలిగిస్తున్న సభ్యుల నుంచి వసూలు చేస్తే బాగుంటుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సభకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం