కాంగ్రెస్ ఇక ప్రత్యామ్నాయం కాదు: సిబల్
బిహార్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఘోరపరాభవం చవిచూసిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదని పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన సొంతపార్టీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు......
సొంత పార్టీపై కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు
పట్నా: బిహార్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఘోరపరాభవం చవిచూసిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదని పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన సొంతపార్టీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను ప్రస్తావించారు. వెంటనే పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు.
బిహార్లో ప్రజలు ఆర్జేడీని ప్రత్యామ్నాయంగా భావించారని సిబల్ తెలిపారు. అలాగే గుజరాత్లో జరిగిన ఉపఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలవలేకపోయామన్నారు. ఆ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తిందన్నారు. ఇక ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి రెండు శాతం కంటే తక్కువ ఓట్లు పడ్డాయన్నారు. ఆరేళ్లుగా ఆత్మపరిశీలన చేసుకోలేని కాంగ్రెస్.. ఇకపై చేసుకుంటుందని ఎలా ఆశించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్యలేంటో అందరికీ తెలుసని.. అయినా, వాటి పరిష్కారాలను గుర్తించడానికి ఎవరూ ఇష్టపడడం లేదని సిబల్ తెలిపారు. ‘‘పార్టీలో ఏం సమస్య ఉందో మాకు తెలుసు. వ్యవస్థాపకంగా ఎలాంటి లోపాలున్నాయో తెలుసు. వాటి పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలకు సమాధానాలేంటో పార్టీకి తెలుసు. కానీ, వాటిని అధికారికంగా గుర్తించడానికి మాత్రం వారు ఇష్టపడడం లేదు. ఇలాగే కొనసాగితే.. పార్టీ గ్రాఫ్ పడిపోతూనే ఉంటుంది. అలాంటి దుస్థితిలో పార్టీ ఉందన్నదే మా ఆవేదన’’ అని సిబల్ అన్నారు.
పార్టీలో కీలక పాత్ర పోషించే ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’(సీడబ్ల్యూసీ) నామినేటెడ్ బాడీ కావడమే పార్టీ దుస్థితికి కారణమని సిబల్ విశ్లేషించారు. సీడబ్ల్యూసీ ఏర్పాటు ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఎన్నికలో పరాభవం ఎదుర్కొంటున్న కాంగ్రెస్ దుస్థితిని మార్చే పరిష్కారం నామినేటెడ్ సభ్యుల నుంచి వస్తుందని భావించలేమన్నారు. పార్టీలో ఉన్న ‘నామినేటెడ్’ సంస్కృతి పోవాలన్నారు. ఇలాంటివి సంప్రదాయం ఎన్నికల్లో సత్ఫలితాలివ్వలేదన్నారు. ఇదే విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేస్తే ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు, దాని పర్యవసనాల్ని చూడాల్సి వచ్చిందన్నారు. పరోక్షంగా గతంలో సిబల్ సహా మరో 22 మంది కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాసిన లేఖను ప్రస్తావించారు.
ఇప్పటి వరకు పార్టీలో ఎవరూ లేఖపై వివరణ కోరలేదన్నారు. అది రాసిన సభ్యులతో కనీసం మాట్లాడే ప్రయత్నమూ చేయలేదని వివరించారు. దీంతో తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే వేదికే లేకుండా పోయిందన్నారు. అందుకే ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయాల్సి వస్తోందన్నారు. తాను కాంగ్రెస్ వ్యక్తినని.. భవిష్యత్తులోనూ కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతం దేశాన్ని పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం చూపిస్తుందని.. చూపాలని ఆశిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. బిహార్లో పార్టీ ఫలితాలపై ఇప్పటి వరకు అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని సిబల్ పేర్కొన్నారు. బహుశా దీన్ని వారు సర్వసాధారణ విషయంగా భావించి ఉంటారన్నారు.
పార్టీ ప్రక్షాళన ఎలా చేపట్టాలో సిబల్ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అనుభవజ్ఞులైన నేతలు, దేశ సమకాలీన రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకునే వ్యక్తులు, మీడియాలో పార్టీని చూపించాల్సిన విధానం గురించి అవగాహన ఉన్న నాయకులతో చర్చించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలను చేరుకోవాలంటే కూటములు తప్పవన్నారు. ప్రజలు ఇక ఏమాత్రం పార్టీ దగ్గరకు వచ్చే పరిస్థితి లేదన్నారు. పార్టీయే ప్రజల వద్దకు వెళ్లాలని హితవు పలికారు. దీనికి అనుభవజ్ఞులైన నాయకుల సూచనలు అవసరమన్నారు. ఇవన్నీ జరగాలంటే ముందు పార్టీలో లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM