బిహార్ సీఎంగా మళ్లీ నీతీశ్
బిహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.
ఎన్డీయే శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక
రేపే ప్రమాణ స్వీకారం
భాజపా పక్ష నేతగా తార్ కిషోర్ ప్రసాద్
పట్నా: బిహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి తరఫున ముఖ్యమంత్రిగా మరోసారి నీతీశ్ కుమార్ ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ఎన్డీయే శాసనసభ పక్ష నేతగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో భాజపా పక్ష నేతగా తార్ కిషోర్ ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. సమావేశం అనంతరం గవర్నర్ను కలిసిన నీతీశ్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. కూటమి సమావేశంలో భాజపా నుంచి రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడణవీస్ వంటి నేతలు పాల్గొన్నారు. బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి సమావేశమవడం ఇదే తొలిసారి.
తాజా ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో ఉన్న భాజపా (74), జనతాదళ్ (యునైటెడ్) (43), హిందుస్థానీ అవాం మోర్చా (4), విరాస్శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) (4) మొత్తం కలిపి 125 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే, జేడీయూకి గతంతో పోలిస్తే (2015 ఎన్నికల్లో 71 స్థానాల్లో గెలుపు) ఈ సారి తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నీతీశ్ కుమార్ ఉంటారని ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు ఇదివరకే స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశమైన కూటమి నేతలు.. స్పీకర్, మంత్రివర్గ కూర్పుపై కూడా చర్చించినట్లు సమాచారం.
వరుసగా నాలుగోసారి.. మొత్తంగా ఏడోసారి సీఎంగా..
కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా వివిధ హోదాల్లో నీతీశ్ కుమార్ బిహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయన మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి సిద్ధమయ్యారు.
* 2000 మార్చి 3 నుంచి వారం రోజుల పాటు ఆయన తొలిసారి బిహార్ సీఎం పగ్గాలు చేపట్టారు.
* 2005 నవంబర్ 24 నుంచి 2010 నవంబర్ 24 వరకు రెండోసారి
* 2010 నవంబర్ 26 నుంచి 2014 మే 17 వరకు మూడోసారి (అనంతరం జితన్ రాం మాంఝీ తొమ్మిది నెలలపాటు సీఎం పదవి చేపట్టారు.)
* 2015 ఫిబ్రవరి 22 నుంచి 2015 నవంబర్ 19 వరకు నాలుగోసారి
* 2015 నవంబర్ 20 నుంచి 2017 జులై 26 వరకు ఐదో సారి (మహా కూటమితో)
* 2017 జులై 27 నుంచి 2020 నవంబర్ 13 వరకు ఆరోసారి
* ప్రస్తుతం బిహార్ ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ ఏడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!