ప్రధాని మోదీ స్వప్నం అదే: యోగి
యూపీలోని రామజన్మభూమి అయోధ్యను వేద రామయణ నగరంగా అభివృద్ధి చేయడమే ప్రధాని మోదీ స్వప్నమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దీన్ని సుందర నగరంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ కార్యక్రమంలో...........
అయోధ్య: యూపీలోని రామజన్మభూమి అయోధ్యను వేద రామయణ నగరంగా అభివృద్ధి చేయడమే ప్రధాని మోదీ స్వప్నమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దీన్ని సుందర నగరంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం ప్రారంభ ఘట్టం చూడటం ఈ తరం అదృష్టమేనన్నారు. గత 500 ఏళ్లుగా సాగిన పోరాటంలో ఎంతోమంది సాధువులు ఈ నిర్మాణం ప్రారంభం కావాలని కలలు కన్నప్పటికీ చివరకు మరణించారని తెలిపారు. రామ రాజ్యం అనే భావజాలాన్ని అమలుపరుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
సుందరమైన ఆధ్యాత్మిక నగరంగా దీన్ని తీర్చిదిద్దడంలో అందరి మద్దతు తీసుకుంటున్నామన్నారు. దేశంలో కేంద్రం చేపట్టిన ఆయుష్మాన్ భారత్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ కనెక్షన్లు, పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం వంటివి కార్యక్రమాలు అభివృద్ధికి సూచికలుగా నిలుస్తున్నాయని యోగి చెప్పారు. కరోనా లేకపోయినట్టయితే ఈ దీపోత్సవం మరింత ఘనంగా జరుపుకొనేవాళ్లమని తెలిపారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కరోనా వైరస్పై గట్టిగా పోరాటం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
రామ్, రామరాజ్య అనే పదాలు భారతీయ సంస్కృతి నుంచి విడదీయరాని భాగాలని యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అన్నారు. కరోనా అంతమయ్యేంత వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ దీపోత్సవ్ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, పలువురు సాధువులు, మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామమందిరం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య