కలత చెందడం సహజమే కదా..!:గహ్లోత్
పార్టీ నాయకత్వంతో మంతనాల అనంతరం సచిన్ పైలట్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి వర్గం ఎమ్మెల్యేలు తీవ్రఅసంతృప్తి చెందినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి వర్గం ఎమ్మెల్యేల నిరాశ
జైపుర్: నెలరోజుల ప్రతిష్టంభన అనంతరం రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెరపడిన విషయం తెలిసిందే. ఈ నెలరోజుల నుంచి ముఖ్యమంత్రి వర్గం ఎమ్మెల్యేలు జైపుర్లోని హోటల్లోనే మకాం వేశారు. పార్టీ నాయకత్వంతో మంతనాల అనంతరం సచిన్ పైలట్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి వర్గం ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి చెందినట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన సమాచారంతో ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేలను కలిసేందుకు హోటల్కు వెళ్లిన సందర్భంలో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
దీనిపై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పందిస్తూ.. ‘నెలరోజుల సుదీర్ఘ సమయంపాటు ఎమ్మెల్యేలు హోటల్లోనే ఉన్నారు. ఈ సమయంలో ఎపిసోడ్కు ముగింపు పలికిన తీరుపై ఎమ్మెల్యేలు కలత చెందడం సహజమేకదా’ అని విలేకరులతో వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలతో తీవ్ర నిరాశలోఉన్న ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి బుజ్జగించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంతోపాటు ప్రజలకు సేవ చేయడంలో భాగంగా ఒక్కోసారి సహనంతో మెలగాల్సి ఉంటుందని ఎమ్మెల్యేలతో అన్నారు. పార్టీలోకి తిరిగివస్తున్న ఎమ్మెల్యేలను క్షమిస్తూ, జరిగిన ఘటనను మరచిపోయి ముందుకు సాగాలని సూచించారు.
ఇదిలాఉంటే, పార్టీ నాయకత్వం హామీతో రెబల్ నేత సచిన్ పైలట్ జైపుర్ చేరుకున్నారు. తాను లేవనెత్తిన అంశాలను పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. అయితే పార్టీలో తనకు ఎలాంటి పదవులు కావాలనే విషయాలపై డిమాండ్ చేయలేదని సచిన్ స్పష్టం చేశారు. కేవలం తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలపై ఎటువంటి ప్రతీకారచర్యలు తీసుకోవద్దని మాత్రమే కోరినట్లు సచిన్ వెల్లడించారు.
ఇవీ చదవండి..
ఆ వ్యాఖ్యలు నన్ను బాధించాయి: సచిన్ పైలట్
కాంగ్రెస్లోనే సచిన్ పైలట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!