విపక్ష నేతల తీరుపై కేంద్రమంత్రి ఫైర్
వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో విపక్ష నేతలు వ్యవహరించిన తీరుపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ విరుచుకుపడ్డారు. ఎగువ సభలో ప్రతిపక్ష నేతలు ప్రవర్తించిన తీరు బాధ్యతారాహిత్యంగా..........
దిల్లీ: వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో విపక్ష నేతలు వ్యవహరించిన తీరుపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ విరుచుకుపడ్డారు. ఎగువ సభలో ప్రతిపక్ష నేతలు ప్రవర్తించిన తీరు బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. బిల్లుల ఆమోదం సందర్భంలో విపక్ష నేతలు అన్ని నిబంధనలనూ ఉల్లంఘించారన్నారు. ఆదివారం రోజున సభలో విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు అవమానకరమని, బాధ్యతారాహిత్యమంటూ మండిపడ్డారు. ఇంకొందరు సభ్యులు సోమవారం సస్పెండ్ అయినప్పటికీ సభను ఖాళీ చేయలేదని విమర్శించారు. రాజ్యసభలో ఆది, సోమవారాల్లో చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితులపై ఆయన కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషీ, పీయూష్ గోయల్తో కలిసి మాట్లాడారు.
రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఆమోదానికి తమకు స్పష్టమైన మెజార్టీ ఉందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ బిల్లులకు 110 మంది మద్దతు తెలిపితే.. కేవలం 70మంది మాత్రమే వ్యతిరేకించారన్నారు. ఆదివారం కొందరు సభ్యులు రాజ్యసభలో టేబుళ్లపైకి ఎక్కి ఆందోళనలు చేయడాన్ని తప్పుబట్టారు. సభలో డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ఉండగా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరుకు బిహార్ ప్రజలు ఎంతో బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంల ప్రకటనలను ఉటంకించిన రవిశంకర్ ప్రసాద్.. ఒప్పంద సేద్యం, వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ కమిటీలపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోందని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM