కేటీఆర్ తక్షణమే నగరంలో పర్యటించాలి:రేవంత్
నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. వర్షాలకు నగరంలోని నాలాలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోందని..
హైదరాబాద్: నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. వర్షాలకు నగరంలోని నాలాలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం మీడియాతో రేవంత్ మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గంలో కాలనీలు మునిగిపోతున్నా ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజలకి అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తక్షణమే నగరంలో పర్యటించి నాలాల స్థితిగతులు, మ్యాన్ హోళ్లను పరిశీలించాలని రేవంత్ డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు ప్రమాద ఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నగరంలోని డివిజన్ల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారికి అవసరమైన సహాయ సహకారాలందించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు. -
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది.
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం