ఆ చట్టాల్ని తిప్పికొట్టేలా చట్టాలు చేయండి : సోనియా
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన వ్యవసాయ చట్టాల అమలును అడ్డుకొనే చట్టాల్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తీసుకురావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి
దిల్లీ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన వ్యవసాయ చట్టాల అమలును అడ్డుకొనే చట్టాల్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తీసుకురావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ మేరకు సూచించారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 254(2) ప్రకారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త చట్టాల్ని తీసుకొచ్చే మార్గాలను అన్వేషించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు. ఈ విధానం ప్రకారం కేంద్ర చట్టానికి సమ్మతి తెలపకుండా చట్టం చేసుకొనే అవకాశం రాష్ట్రాలకు ఉంటుంది. అనంతరం ఆ చట్టం రాష్ట్రపతి ఆమోదం కోసం వెళుతుందని’ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.
సోనియా గాంధీ సూచించిన ఈ చట్టం ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాన్ని రాష్ట్రాల్లో అమలు కాకుండా చేసే వీలుంది. అయితే దీనికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరిగా ఉండి తీరాలి. అప్పుడే అది రాష్ట్రంలో పక్కాగా అమలు చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారమే ఆమోదం తెలిపారు. ఈ చట్టం ద్వారా రైతులు సులభంగా తమ పంటను పెద్ద వ్యాపారులకు అమ్ముకునే సౌలభ్యం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కాలం చెల్లిన విధానానికి స్వస్తి పలికి, దళారుల బెడద లేకుండా వ్యవస్థాగత కొనుగోలుదార్లకు, పెద్ద రీటైలర్లకు అమ్మకాలు చేసే సదుపాయం రైతులకు దొరుకుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఈ విధానంతో రైతులు బేరమాడి మంచి ధర పొందలేరని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో హోల్సేల్ మార్కెట్ వ్యవస్థ, సకాలంలో చెల్లింపులు ఉండవని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం తెలుపుతున్నాయి. ఈ చట్టాలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తాయని ఆక్షేపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్