Gujarat Assembly Polls: 10 సార్లు ఎమ్మెల్యే..కాంగ్రెస్కు గుడ్ బై
గుజరాత్లో కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్సిన్హ్ రత్వా పార్టీకి రాజీనామా చేశారు. 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడటం చర్చనీయాంశమైంది.
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్సిన్హ్ రత్వా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. దాదాపు 2 దశాబ్దాలుగా అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్న హస్తం పార్టీకి ఇది మింగుడుపడని అంశమే. చోటాఉదయ్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రత్వా..ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ ఠాకూర్కు పంపారు. మరోవైపు ఆయన బుధవారం భాజపాలో చేరనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్సిన్హ్ రత్వాకు గిరిజన ఓటు బ్యాంకుపై మంచి పట్టుంది. అయితే, తాజా ఎన్నికల్లో తాను పోటీచేయబోనని, చోటా ఉదయ్పూర్ స్థానాన్ని తన కుమారుడు రాజేంద్రసిన్హ్ రత్వాకు కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరారు. కానీ, ఆ స్థానాన్ని తన కొడుక్కే ఇవ్వాల్సిందిగా ఎంపీ నరన్ రత్వా పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విభేదాల నేపథ్యంలోనే మోహన్ సిన్హ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్