Gujarat Assembly Polls: 10 సార్లు ఎమ్మెల్యే..కాంగ్రెస్‌కు గుడ్‌ బై

గుజరాత్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోహన్‌సిన్హ్‌ రత్వా పార్టీకి రాజీనామా చేశారు. 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడటం చర్చనీయాంశమైంది.

Published : 08 Nov 2022 21:25 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్‌సిన్హ్‌ రత్వా కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పారు. దాదాపు 2 దశాబ్దాలుగా అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్న హస్తం పార్టీకి ఇది మింగుడుపడని అంశమే. చోటాఉదయ్‌పూర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రత్వా..ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్‌ ఠాకూర్‌కు పంపారు. మరోవైపు ఆయన బుధవారం భాజపాలో చేరనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోహన్‌సిన్హ్‌ రత్వాకు గిరిజన ఓటు బ్యాంకుపై మంచి పట్టుంది. అయితే, తాజా ఎన్నికల్లో తాను పోటీచేయబోనని, చోటా ఉదయ్‌పూర్‌ స్థానాన్ని తన కుమారుడు రాజేంద్రసిన్హ్‌ రత్వాకు  కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరారు. కానీ, ఆ స్థానాన్ని తన కొడుక్కే ఇవ్వాల్సిందిగా ఎంపీ నరన్‌ రత్వా పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విభేదాల నేపథ్యంలోనే మోహన్‌ సిన్హ్‌ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని