Aroori Ramesh: నన్ను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదు: ఆరూరి రమేశ్‌

తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, భారాస నేత ఆరూరి రమేశ్‌ తెలిపారు.

Updated : 13 Mar 2024 16:11 IST

హైదరాబాద్‌: తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, భారాస నేత ఆరూరి రమేశ్‌ తెలిపారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌ వచ్చినట్టు చెప్పారు. భారాసలోనే ఉన్నానని, మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలవలేదని స్పష్టం చేశారు. ఆరూరి రమేశ్‌ పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయనను.. కేసీఆర్‌ పిలిపించారు. దీంతో బుధవారం ఉదయం  ఆపార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, బసవరాజు సారయ్య రమేశ్‌ ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కేసీఆర్‌ నివాసానికి తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు