Rahul Gandhi: ఆమేఠీ నుంచి మళ్లీ పోటీ చేస్తారా? రాహుల్ సమాధానం ఇదే..!
దేశంలో పెరుగుతోన్న విద్వేషాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిలబడాలనే లక్ష్యంతోనే భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) మొదలుపెట్టినట్టు కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు.
దిల్లీ: దేశంలో పెరుగుతోన్న విద్వేషాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిలబడాలనే లక్ష్యంతోనే భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) మొదలుపెట్టినట్టు కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలిపారు. తన యాత్ర లక్ష్యం రాజకీయాలు కాదు.. దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తేవడమేనన్నారు. భారత్ జోడో యాత్ర దేశ ప్రజల వాణిని వినిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఈ యాత్ర కొనసాగుతున్న వేళ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్లో సంపదంతా కేవలం ముగ్గురు నలుగురు పారిశ్రామికవేత్తల వద్ద పోగుపడిపోవడమే నిరుద్యోగం విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణమన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన ఆమేఠీ నుంచి పరాజయం పాలైన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అకాశం వస్తే మళ్లీ అక్కడి నుంచి బరిలో నిలుస్తారా? అని విలేకర్లు అడగ్గా.. ఏడాది, ఏడాదిన్నర తర్వాత ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటానని సమాధానమిచ్చారు. ఈ విషయంలో మీడియాకు హెడ్లైన్ ఇవ్వదలచుకోలేదని.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కేవలం భారత్ జోడో యాత్రపైనే ఉందని రాహుల్ పేర్కొన్నారు.
ఆ నేతలిద్దరూ కాంగ్రెస్ ఆస్తులు
రాజస్థాన్ కాంగ్రెస్లో సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య నెలకొన్న వివాదంపైనా రాహుల్ స్పందించారు. ఆ నేతలిద్దరూ కాంగ్రెస్కు ఆస్తులన్నారు. అయితే, ఆ నేతల మధ్య భేదాభిప్రాయాలు త్వరలో తాను ఆ రాష్ట్రంలో తాను కొనసాగించనున్న భారత్ జోడో యాత్రపై ఎలాంటి ప్రభావం చూపబోదని విశ్వాసం వ్యక్తంచేశారు. తాను కాంగ్రెస్ గురించి గానీ, రాజకీయాల గురించి గానీ ఆలోచించడంలేదని.. విధ్వంసానికి గురవుతున్న దేశం గురించే ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నారు.
నా ఇమేజ్ నాశనం చేసేందుకు వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు
అధికార పార్టీ నేతలు తనపై చేస్తోన్న వ్యక్తిగత విమర్శలపై స్పందించిన రాహుల్.. తన యాత్రతో భాజపా గందరగోళంలో పడిందన్నారు. తన ఇమేజ్ని నాశనం చేసేందుకు భాజపా నేతలు రూ.వేల కోట్లను ఖర్చు చేస్తున్నారనీ.. వాస్తవానికి అది తనకే అనుకూలంగా మారుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో స్థానం సంపాదించినప్పుడే వ్యక్తిగత దాడులు వస్తాయని.. తాను సరైన దిశలోనే ఉన్నానని అర్థమవుతోందన్నారు. తాను ఎలా ముందుకెళ్లాలో ఈ దాడులే నేర్పుతాయని రాహుల్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?