బెంగాల్‌ ఎన్నికలు: భాజపా ఏజెంట్‌ హఠాన్మరణం

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి ఐదో దశ ఎన్నికల పోలింగ్‌ శనివారం కొనసాగుతోంది. 45 స్థానాల పరిధిలో ఉదయం 09:30 గంటల సమయానికి 16.15శాతం పోలింగ్‌ నమోదైంది.

Published : 17 Apr 2021 11:32 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి ఐదో దశ ఎన్నికల పోలింగ్‌ శనివారం కొనసాగుతోంది. 45 స్థానాల పరిధిలో ఉదయం 09:30 గంటల సమయానికి 16.15శాతం పోలింగ్‌ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇటీవల నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా కోచ్‌బిహార్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. అధికారులు పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతానికి పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

భాజపా బూత్‌ ఏజెంట్‌ హఠాన్మరణం
కమర్‌హాతీ ప్రాంతంలోని 107వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో భాజపా ఏజెంట్‌ హఠాత్తుగా మృతి చెందడం కలకలం సృష్టించింది. దీంతో అతడి మృతిపై నివేదిక సమర్పించాలని ఈసీ.. ఎన్నికల సిబ్బందిని ఆదేశించింది. ఉత్తర బర్దమాన్‌ అసెంబ్లీ పరిధిలో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద తమ బూత్‌ ఏజెంట్లపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని భాజపా ఆరోపించింది. పలు చోట్ల సీఆర్పీఎఫ్‌ జవాన్లు పోలింగ్‌ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని టీఎంసీ ఆరోపించింది. 

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి నాలుగో దశలో భాగంగా మొత్తం 45 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 342 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఆరు జిల్లాల పరిధిలో 15,789 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని