బెంగాల్ ఎన్నికలు: భాజపా ఏజెంట్ హఠాన్మరణం
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఐదో దశ ఎన్నికల పోలింగ్ శనివారం కొనసాగుతోంది. 45 స్థానాల పరిధిలో ఉదయం 09:30 గంటల సమయానికి 16.15శాతం పోలింగ్ నమోదైంది.
కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఐదో దశ ఎన్నికల పోలింగ్ శనివారం కొనసాగుతోంది. 45 స్థానాల పరిధిలో ఉదయం 09:30 గంటల సమయానికి 16.15శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇటీవల నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా కోచ్బిహార్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
భాజపా బూత్ ఏజెంట్ హఠాన్మరణం
కమర్హాతీ ప్రాంతంలోని 107వ నంబర్ పోలింగ్ బూత్లో భాజపా ఏజెంట్ హఠాత్తుగా మృతి చెందడం కలకలం సృష్టించింది. దీంతో అతడి మృతిపై నివేదిక సమర్పించాలని ఈసీ.. ఎన్నికల సిబ్బందిని ఆదేశించింది. ఉత్తర బర్దమాన్ అసెంబ్లీ పరిధిలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తమ బూత్ ఏజెంట్లపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని భాజపా ఆరోపించింది. పలు చోట్ల సీఆర్పీఎఫ్ జవాన్లు పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని టీఎంసీ ఆరోపించింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి నాలుగో దశలో భాగంగా మొత్తం 45 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 342 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఆరు జిల్లాల పరిధిలో 15,789 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!