Girish Bapat: భాజపా ఎంపీ గిరీశ్ బాపట్ కన్నుమూత.. ప్రధాని మోదీ విచారం
Girish Bapat: భాజపా లోక్సభ ఎంపీ గిరీశ్ బాపట్ ఇకలేరు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలోచికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
పుణె: భాజపా(BJP) సీనియర్ నేత, పుణె ఎంపీ గిరీశ్బాపట్(Girish Bapat) (73) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. బాపట్ కస్బాపేట్ నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే, 2019లో ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్ర పౌర సరఫరాలశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ సేవలందించారు.
‘‘ఈ రోజు చాలా విషాదకరమైన దినం. భాజపా సీనియర్ నేత, పుణె లోక్సభ సభ్యుడు గిరిశ్ బాపట్ మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఆస్పత్రిలోనే కన్నుమూశారు. గత ఏడాదిన్నర కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ మృతిచెందారు’’ అని భాజపా పుణె నగర అధ్యక్షుడు జగదీశ్ ములిక్ ట్విటర్లో వెల్లడించారు. మరోవైపు, గిరీశ్ బాపట్ మరణం పట్ల మహారాష్ట్ర భాజపా సంతాపం తెలిపింది. ఈ విషాదకర సమయంలో పార్టీ మొత్తం ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని పేర్కొంది.
గిరీశ్ బాపట్ మృతిపై ప్రధాని మోదీ విచారం
గిరీశ్ బాపట్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. ఆయన నిరాడంబరుడని.. కష్టపడి పనిచేసే స్వభావం కలిగగిన నేత అని కొనియాడారు. సమాజానికి ఎంతో శ్రద్ధతో పనిచేశారన్నారు. మహారాష్ట్ర అభ్యున్నతి కోసం విస్తృతంగా పనిచేశారని.. మరీ ముఖ్యంగా పుణె అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో కృషిచేసిన అలాంటి నేత మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహారాష్ట్రలో భాజపా నిర్మాణం, బలోపేతంలో కీలక పాత్ర పోషించారన్నారు.
మరణవార్త బాధించింది.. సీఎం శిందే
పుణె ఎంపీ గిరీశ్ బాపట్ మరణంపై సీఎం ఏక్నాథ్ శిందే సంతాపం ప్రకటించారు. ఆయన మరణవార్త బాధించిందంటూ ట్వీట్ చేశారు. కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా, కేబినెట్మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ జీవితానుభవం కలిగిన ప్రజాభిమానం ఉన్న నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం