Kishanreddy: భాజపా నేతలతో కిషన్‌రెడ్డి అత్యవసర సమావేశం

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారి హైదరాబాద్‌ విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

Updated : 05 Jul 2023 21:51 IST

హైదరాబాద్‌: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారి హైదరాబాద్‌ విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. శంషాబాద్‌ విమానాశ్రయానికి భారీగా చేరుకున్న భాజపా కార్యకర్తలు, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ తదితరులు కిషన్‌రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌లో భాజపా నేతలతో కిషన్‌రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కిషన్‌రెడ్డికి ఇది తొలి సమావేశం. పార్టీ నేతలు లక్ష్మణ్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌, ఎంపీ అర్వింద్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు