BV Raghavulu: ఏపీలో రాజకీయాలు అధ్వానం: బీవీ రాఘవులు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అధ్వానంగా ఉన్నాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.

Updated : 25 Aug 2023 16:33 IST

పెదనందిపాడు: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అధ్వానంగా ఉన్నాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో నూతనంగా నిర్మించిన తేళ్ల నారాయణ విజ్ఞన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. అమరావతిలో కత్తులు దూసుకుంటున్నారని, విశాఖపట్నం కబ్జాల  కేంద్రంగా మారిందని విమర్శించారు. తెదేపా హయాంలో చేయలేని పనులు మెడకు చుట్టుకున్నాయన్నారు. శాసనసభ భవనాలు శాశ్వతంగా నిర్మిస్తే 3 రాజధానుల పంచాయితీ ఉండేది కాదన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, కేఎస్‌ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని