Chandrababu: ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తాం: చంద్రబాబు
గుర్తింపు కార్డులు లేకుండా పోలీసులు తన పర్యటనలో తిరుగుతున్నారని, పలమనేరు డీఎస్పీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
కుప్పం: ప్రశాంతంగా ఉన్న కుప్పంలో పోలీసుల చేత దాడి చేయించింది సైకో సీఎం అని తెదేపా అధినేత చంద్రబాబు నాయడు ఆరోపించారు. పోలీసుల లాఠీఛార్జిలో గాయపడి కుప్పం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్యామల, పసలరాణి, హరీశ్లను ఆయన ఇవాళ పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. కుప్పం ఏమైనా పాకిస్థానా? శత్రుదేశమా? యుద్ధ భూమా? అని ప్రశ్నించారు. ఏ కారణం లేకపోయిన వాళ్ల మనోధైర్యం దెబ్బతీశారని, 1500 మంది పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. పోలీసులపై ఒత్తిడి ఉంటే ఇలా చేస్తారా? అని ప్రశ్నించారు. నిజం నిప్పులాంటిదని.. ఎప్పటికైనా దహించివేస్తుందన్నారు. జగన్ బలవంతంగా నేరాలు ఘోరాలు చేయించి.. ఆయనతో పాటు మిమ్మల్ని కూడా జైలుకు తీసుకెళ్తారని పోలీసులకు సూచించారు. కందుకూరులో ఎంత మంది పోలీసులను పెట్టారు? మీరే కుట్ర చేసి తొక్కిసలాట జరిగేలా చేసి మీరే కేసులు పెడతారా అని ధ్వజమెత్తారు. తాను రాకూడదని, గ్రామాల్లో తిరగకూడదని ఏ చట్టం చెప్పిందని ప్రశ్నించారు. అమూల్ బేబీ సీఎం శివశక్తి పాల ధరల గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. గుర్తింపు కార్డులు లేకుండా పోలీసులు తన పర్యటనలో తిరుగుతున్నారని, పలమనేరు డీఎస్పీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM