Chandrababu: ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానే: చంద్రబాబు

కోడికత్తి డ్రామా నుంచి వివేకా హత్య వరకూ అన్ని అస్త్రాలు ఉపయోగించిన జగన్.. ఇప్పుడు కుల, మత రాజకీయాలపై పడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Published : 18 Mar 2024 20:06 IST

అమరావతి: కోడికత్తి డ్రామా నుంచి వివేకా హత్య వరకూ అన్ని అస్త్రాలు ఉపయోగించిన జగన్.. ఇప్పుడు కుల, మత రాజకీయాలపై పడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానేనని స్పష్టం చేశారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి, పలువురు ముస్లిం సంఘాల నేతలు సోమవారం చంద్రబాబును కలిశారు. పొత్తుపై వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ముస్లిం సంఘాలకు ఆయన పిలుపునిచ్చారు.

సీఎం జగన్‌ ముఖంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. తెదేపా-భాజపా పొత్తుతో ముస్లిం మైనారిటీలకు నష్టం అంటూ వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలను నమ్మరన్నారు. ముస్లింలపై జగన్‌కు నిజంగా ప్రేమ ఉంటే రంజాన్ మాసంలో ఇచ్చే తోఫాను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దుల్హన్‌ పథకం, దుకాన్ మకాన్‌ సహా పది సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్.. ఎన్నికలు రాగానే మత రాజకీయంతో లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు