Chintakayala Vijay: సీఐడీ విచారణకు హాజరైన తెదేపా నేత చింతకాయల విజయ్
ఏపీ సీఐడీ విచారణకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ హాజరయ్యారు.
అమరావతి: ఏపీ సీఐడీ విచారణకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ హాజరయ్యారు. గతంలో భారతి పే పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోకు సంబంధించిన కేసులో విజయ్కు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల నర్సీపట్నంలో నివాసానికి వెళ్లి ఆయన తల్లి పద్మావతికి నోటీసులు అందించారు. ఐపీసీ 419, 469, 153(ఎ), 505(2), 120(బి), రెడ్ విత్ 34 సెక్షన్లతోపాటు ఐటీ చట్టంలో 66(సి) సెక్షన్లతో మంగళగిరిలోని సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లో గతేడాది అక్టోబరు 1న క్రైమ్ నంబరు 14/2022తో కేసు నమోదైనట్లు నోటీసులో పేర్కొన్నారు.
విజయ్ హాజరు నేపథ్యంలో సీఐడీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పోలీసులు ఆంక్షలు విధించారు. కార్యాలయానికి దూరంగానే తెదేపా శ్రేణులను ఆపేశారు. తెదేపా నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
భారతి పే పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోకు సంబంధించిన కేసులో ఇదివరకు హైదరాబాద్లో విజయ్ నివాసానికి వెళ్లిన ఏపీసీఐడీ పోలీసులు అక్కడ హంగామా సృష్టించారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో చిన్నపిల్లలను, పనిమనిషిని భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసుల వైఖరిపై విజయ్ తరఫున న్యాయవాది కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సీఐడీ పోలీసుల తీరును తప్పుపట్టింది. విచారణ చేయాలనుకుంటే ముందుగా 41(ఎ) నోటీసు జారీచేసి వెళ్లాలని సూచించింది. దీంతో విజయ్పై చర్యలను తాత్కాలికంగా నిలిపేయాల్సి వచ్చింది. ఉన్నట్టుండి అదే కేసులో మళ్లీ నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయపరమైన కారణాలున్నాయన్న చర్చ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష