CPM: విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీలో రూ.1,250 కోట్ల కుంభకోణం: సీపీఎం

విద్యార్థులకు వైకాపా ప్రభుత్వం అందించిన ట్యాబ్‌లు, వాటికి అవసరమైన కంటెంట్ సమకూర్చడంలో రూ.1,250 కోట్ల అవినీతి జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు.

Published : 25 Dec 2023 15:42 IST

అమరావతి: విద్యార్థులకు వైకాపా ప్రభుత్వం అందించిన ట్యాబ్‌లు, వాటికి అవసరమైన కంటెంట్ సమకూర్చడంలో రూ.1,250 కోట్ల అవినీతి జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. గతేడాది రూ.9 వేలు విలువ చేసే ఒక్కో ట్యాబ్‌ను రూ.13 వేలకు కొనుగోలు చేశారన్నారు. ఈ ఏడాది రూ.12 వేలు ఉన్న ట్యాబ్‌ను రూ.17,500కు కొన్నారని చెప్పారు. ఇలా ట్యాబ్‌ల కొనుగోళ్లలో రూ.250 కోట్ల అవినీతి జరిగితే.. కంటెంట్‌లోనూ రూ.వెయ్యి కోట్ల పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బైజూస్ వంటి సంస్థకు ఈ ట్యాబ్‌లు, వాటికి కావాల్సిన కంటెంట్ అందించే బాధ్యతను జగన్ ప్రభుత్వం అప్పగించిందని మండిపడ్డారు. ఈ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ జగన్ సర్కార్ అబద్ధాలు చెబుతోందని ఆక్షేపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని