Deve Gowda: భాజపా-జేడీఎస్ దోస్తీ.. దేవెగౌడ కీలక వ్యాఖ్యలు
ఇటీవల ఎన్డీయేకి తమ పార్టీ సన్నిహితం కావడంపై జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా(BJP)తో తమ పార్టీ దోస్తీ కట్టడాన్ని జేడీఎస్(JDS) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) సమర్థించుకున్నారు. తమ పార్టీకి అధికార దాహం లేదన్న దేవెగౌడ. అవకాశవాద రాజకీయాలను చేయబోమన్నారు. ఇటీవల భాజపాతో పొత్తు, ఎన్డీయేలో చేరిక అంశంపై జేడీఎస్కు చెందిన కొందరు నేతలు విభేదిస్తున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన బెంగళూరులో విలేకర్ల వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ లౌకిక ప్రమాణాలకు కట్టుబడి ఉందని.. మైనార్టీలను ఎప్పటికీ నిరాశపరచబోమన్నారు. కర్ణాటకలో రాజకీయ పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)కు వివరించినట్టు చెప్పారు. గత పదేళ్లలో తొలిసారి హోంమంత్రి అమిత్ షాతో చర్చించానన్నారు. తమ పార్టీని కాపాడుకొనే లక్ష్యంతోనే 2014లోక్సభ ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకున్నట్టు దేవెగౌడ తెలిపారు.
భయపడొద్దు.. లౌకిక ప్రమాణాలను వదులుకోం..
‘‘భాజపాతో పొత్తు పెట్టుకోవడం ద్వారా మా లౌకిక ప్రమాణాలను కొంచెం కూడా వదులుకొనే రాజకీయాలు చేయం. కుమారస్వామి భాజపా నేతలను కలవడానికి ముందు నేను హోంమంత్రి అమిత్ షాను కలిశాను. ఇందులో దాచడానికి ఏమీ లేదు. కర్ణాటక రాజకీయ పరిస్థితులపై ఆయనతో వివరంగా మాట్లాడాను. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. 50 ఏళ్ల రాజకీయ పోరాటంలో ఈ పార్టీలో ఏ ఒక్క వర్గానికీ అన్యాయం జరగలేదు. కర్ణాటక రాజకీయ పరిస్థితులను అమిత్షాకు వివరించిన తర్వాత జేడీఎస్ను నడిపిస్తున్న నా తనయుడిని పంపిస్తానని చెప్పా. నిర్ణయం తీసుకునే ముందు కూడా మా పార్టీకి చెందిన మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలతో పాటు మరికొందరు నేతలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నాం. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి హోంమంత్రితో సమావేశమై చర్చించాను. ప్రధాని నరేంద్ర మోదీ బీజీగా ఉంటారు. ఆయన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఈ అంశంలో అందుకే నేటికీ నేను ప్రధానిని కలవలేదు’’ అని వివరించారు.
మోదీకి పట్నాయక్ 8 రేటింగ్ ఇస్తే.. భాజపా మాత్రం నవీన్కు 0 ఇచ్చింది!
కుమార సర్కార్ కూలడానికి బాధ్యత ఎవరిది?
బీజేపీతో పొత్తుపై మా పార్టీ కార్యకర్తల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేదు. జేడీ(ఎస్) అధికార దాహంతో కూడిన పార్టీ కాదు. గతంలో కుమారస్వామి సారథ్యంలోని ప్రభుత్వం(కాంగ్రెస్-జేడీఎస్) పతనం కావడానికి బాధ్యత ఎవరిది? దీని వెనుక ఉన్న గేమ్ ప్లాన్ ఏమిటి? ఇది కాంగ్రెస్ నాయకత్వానికి తెలియదా? రాహుల్ గాంధీ వచ్చి దేవెగౌడ భాజపాకు బీటీమ్ అంటారు. ఇదీ నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సర్టిఫికెట్’’ అన్నారు. భాజపాతో పొత్తు అంశాన్నిసమర్థించుకున్న దేవెగౌడ.. జేడీఎస్ అవకాశవాద రాజకీయాలు చేయదన్నారు. దశాబ్దాలుగా తమ బాధను, పోరాటాన్ని కొనసాగిస్తున్న ఈ పార్టీని కాపాడుకోవాలన్నారు. అంతేతప్ప ఇందులో ఎలాంటి స్వార్థం లేదని చెప్పారు. ఈ నిర్ణయం తానే తీసుకున్నట్టు తెలిపారు.
సంక్షోభంలో ఉన్నాం.. పార్టీని కాపాడుకోవాలి!
జేడీఎస్ ఎమ్మెల్యే కేరెమ్మ నాయక్ భాజపాతో పొత్తుపై అసంతృప్తి వ్యక్తం చేయడంపైనా దేవెగౌడ స్పందించారు. ‘ఆమెతో మంగళవారం రాత్రి మాట్లాడాను. ఆమె పార్టీతోనే ఉన్నారు. నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. స్థానికంగా ఉన్న కొన్ని విభేదాల కారణంగానే ఆమె అలా మాట్లాడారు. కేరళ జేడీఎస్ యూనిట్లో వచ్చిన అసమ్మతి గళాన్ని నేను అంగీకరిస్తున్నా. కేరళ మిత్రులతోనూ చర్చించాను. సంక్షోభంలో ఉన్నాం.. కర్ణాటకలో పార్టీని కాపాడుకోవాలి. పార్టీ అధ్యక్ష పదవిని కేరళ మిత్రులకు వదిలేసేందుకు సైతం నేను సిద్ధమే. నేను అధ్యక్షుడిగా ఉండను. JD(S) ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. మైనారిటీలను ఎన్నడూ నిరాశపరచదు’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Maharashtra: అజిత్ పవార్కు భాజపా సుపారీ.. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి సంచలన ఆరోపణలు
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు అజిత్ పవార్కు భాజపా సుపారీ ఇచ్చిందని మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆరోపించారు. -
Janasena: సినిమాలు ఆపేసినా, బెదిరించినా ఏనాడూ దిల్లీ పెద్దల సాయం కోరలేదు: పవన్
ఏపీలో జనసేనకు ఇవాళ ఆరున్నర లక్షల క్యాడర్ ఉందని, యువతే పెద్ద బలమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. -
Chandrababu: యువత భారీ బైక్ ర్యాలీ.. విజయవాడలో చంద్రబాబుకు ఘనస్వాగతం
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయం నుంచి అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. -
CM Kcr: ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దు.. మళ్లీ భారాసదే విజయం: సీఎం కేసీఆర్
ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దని, మళ్లీ భారాసనే(BRS) విజయం సాధించబోతోందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్(CM Kcr) పేర్కొన్నారు. -
కాంగ్రెస్కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్పై సంజయ్ రౌత్
Congress: కాంగ్రెస్కు మంచి రోజులు వచ్చాయని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపు కూటమి విజయంగా అభివర్ణించారు. -
KCR: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ
డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. -
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు. తాము తెలంగాణ భూభాగంలోకి వెళ్లలేదని చెప్పారు. -
Purandeswari: ఓట్ల కోసమే ‘నాగార్జునసాగర్’ వివాదం: పురందేశ్వరి
ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని నాగార్జునసాగర్ వద్ద నీటి విడుదల అంశాన్ని వివాదాస్పదం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. -
Nara Lokesh: వంద రోజుల్లో.. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం
తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని, ఈ అంశంపై పవన్ కల్యాణ్ అన్నతో తొలి సమావేశంలోనే చర్చించామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. -
‘విశాఖ ఉత్తరం’ అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుస్తామనే ధీమాతో సీఎం జగన్ ఉన్నారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. -
భాజపాను అధికారంలోకి రానివ్వం: బీవీ రాఘవులు
కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా భాజపాను అడ్డుకుంటామని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తేల్చిచెప్పారు. -
ఎన్నికల్లో లబ్ధికోసమే నాటకాలు: రామకృష్ణ
తెలంగాణ ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ నీటి వివాదం పేరుతో కొత్త డ్రామాకు తెర తీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. -
నీటి కోసం దొంగ యుద్ధం: రఘురామ
తెలంగాణలో ఎన్నికలు జరిగే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటికోసం దొంగ యుద్ధం చేసేందుకు ప్రయత్నించిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
విశాఖను ఫైనాన్షియల్ హబ్గా ప్రకటించాలి: ధర్మాన
విశాఖను ఫైనాన్షియల్ హబ్గా ప్రకటించాలని, దీనికి అవసరమైన చర్యలను చేపట్టాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని కోరారు. -
నేడు తెదేపా పార్లమెంటరీ పార్టీ భేటీ
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం జరగనుంది. డిసెంబరు 4 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చించనున్నారు. -
రోడ్లను బురద గుంతల్లా మార్చినందుకు మళ్లీ జగన్ కావాలా?
రాష్ట్రంలోని రహదారుల్ని బురద గుంతల్లా మార్చినందుకు సీఎం జగన్ మళ్లీ కావాలా అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
బీసీల మధ్య చిచ్చు పెట్టడానికే ‘కులగణన’
బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికే సీఎం జగన్ కులగణనను తెరపైకి తెచ్చారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. -
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడమే పొన్నవోలు లక్ష్యం
తెదేపా అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, వ్యక్తిగతంగా ఆయన్ను పలచన చేయడమే లక్ష్యంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి పని చేస్తున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
దేశమంతా రాజస్థాన్ తరహా ఆరోగ్య పథకం
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రారంభించిన ఆరోగ్య పథకం ఆదర్శప్రాయంగా ఉందని, 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఈ పథకాన్ని అమలుచేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. -
5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు.. రూ.2 వేల కోట్ల విలువైన జప్తులు
దేశంలో శాసనసభ ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పలు సందర్భాల్లో కొరడా ఝళిపించింది. -
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో భాజపా ఓడితే.. గోవాలోని ప్రమోద్ సావంత్ సర్కార్ కుప్పకూలిపోతుందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
టాప్గేర్లో టూవీలర్ విక్రయాలు.. ఏ కంపెనీ ఎన్నంటే?
-
Maharashtra: అజిత్ పవార్కు భాజపా సుపారీ.. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి సంచలన ఆరోపణలు
-
PM Modi: భారత్లో కాప్-33 సదస్సు.. దుబాయ్లో ప్రతిపాదించిన మోదీ
-
YS Bhaskarreddy: సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్ భాస్కర్రెడ్డి
-
Nagarjunasagar: సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణలో సాగర్ డ్యామ్: కేంద్రం హోంశాఖ నిర్ణయం
-
Review Calling Sahasra: రివ్యూ: కాలింగ్ సహస్ర.. సుధీర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?