JDS: భాజపా నేతలతో దేవెగౌడ కీలక భేటీ.. ఎన్డీయేలో జేడీఎస్ చేరికకు రంగం సిద్ధం?
సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా భాజపా, జేడీఎస్ ఒక్కటి కాబోతున్నాయి. పొత్తులు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించేందుకు జేడీఎస్ అగ్రనేతలు దేవెగౌడ, కుమారస్వామి భాజపా అగ్రనాయకత్వంతో భేటీ అయ్యారు.
దిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపా, జేడీఎస్ల మధ్య పొత్తులపై చర్చలు కొనసాగుతున్న వేళ గురువారం ఇరు పార్టీల నేతల మధ్య కీలక భేటీ జరిగింది! జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు కుమారస్వామి దిల్లీలో భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా 2024 లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్, భాజపా మధ్య పొత్తులు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో దేవెగౌడ, కుమారస్వామి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఎన్డీయేలో జేడీఎస్ చేరికపై రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
దిల్లీకి బయల్దేరి వెళ్లే ముందు కుమారస్వామి బెంగళూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘ఈ సాయంత్రం సమావేశం ఉంది. ఆ భేటీలో ఫలితం తేలాక దిల్లీలో మీడియా ప్రతినిధులకు రేపు అన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు. అయితే, ఇప్పటివరకు తాము సీట్ల అంశంపై చర్చించలేదన్న కుమారస్వామి.. భాజపా కూడా సీట్ల గురించి ఏమీ ప్రతిపాదించలేదన్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని మొత్తం 28 లోక్సభ స్థానాల్లో ప్రస్తుత పరిస్థితి, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ వాతావరణంపై వివరంగా చర్చిస్తామని తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న జేడీఎస్.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడమే తమ లక్ష్యమని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భాజపా సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్ప జేడీఎస్, భాజపా కలిసే పోటీ చేస్తాయని ప్రకటించారు. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. జేడీఎస్-భాజపా పొత్తు పూర్తిగా అనైతికమవుతుందన్నారు. జేడీఎస్ భాజపాకు బీ టీమ్ అని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పానని, ప్రస్తుతం అది నిరూపణ కాబోతోందంటూ వ్యాఖ్యానించారు. జనతాదళ్ ‘సెక్యులర్’గా చెప్పుకొనే జేడీఎస్ మతతత్వ పార్టీతో చేతులు కలుపుతోందంటూ గతంలో సిద్ధరామయ్య ఆక్షేపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nara Lokesh: ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసింది: లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. -
వర్షంలో పవార్ ప్రసంగం
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా వర్షం కురిసింది. అయితే.. దానిని లెక్కచేయకుండా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో రాహుల్కు యూపీ కోర్టు సమన్లు
కేంద్ర మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సోమవారం సమన్లు జారీ అయ్యాయి. -
Nara Lokesh: వైకాపా దోచిన డబ్బును ప్రజలకు ఇప్పిస్తాం
‘నేను తప్పుచేస్తే.. చంద్రబాబే జైలుకు పంపుతారు. ఏ తప్పూచేయలేదు కనుకే.. ధైర్యంగా రాజోలు సభలో ‘సైకో జగన్’ అని పిలవగలుగుతున్నా’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
యువగళం శబ్దానికి.. పాలకపక్షం పునాదులు కదులుతాయ్
తెదేపా యువనేత నారా లోకేశ్ రెండోవిడత యువగళం పాదయాత్ర శబ్దానికి పాలకపక్షం పునాదులు కదలడం ఖాయమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టంచేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. -
యువగళం.. ప్రభం‘జనం’
వేల మంది అభిమానులు.. దారిపొడవునా నీరాజనాల నడుమ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం పునఃప్రారంభమైంది. -
సమస్యల్ని పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం
సీఎం జగన్కు ఫిబ్రవరి 28 వరకు గడువు ఇస్తున్నామని, అప్పటికీ తమ సమస్యల్ని పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో వైకాపా సర్కారును కూల్చేస్తామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునెయ్య హెచ్చరించారు. -
వైకాపా సామాజిక యాత్రతో ఇక్కట్లు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభ స్థానికులను ఇబ్బందులకు గురి చేసింది. -
మార్పు రాకపోతే బిడ్డల భవిష్యత్తు అతలాకుతలమే
‘ప్రజల్లో ఇప్పటికైనా మార్పు రాకపోతే వారి బిడ్డల భవిష్యత్తు అతలాకుతలమే’ అనే సందేశాన్నిచ్చేలా ఉన్న ఓ లఘుచిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. -
తాడిపత్రిలో బస్సు యాత్ర వెలవెల
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సోమవారం జరిగిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం నుంచి స్పందన కరవైంది. సభలో కనీసం కుర్చీలు వేయకపోవడంతో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
మంత్రాలయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబి) మాజీ అధ్యక్షుడు రామిరెడ్డి తనయులు వైకాపాకు రాజీనామా చేశారు. -
నంద్యాల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా ఫరూక్
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నియమితులయ్యారు. -
అవినీతికి సహకరిస్తారనే డిప్యుటేషన్పై తీసుకొస్తున్నారా?
రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు మీ అవినీతికి సహకరించడం లేదనే కేంద్ర సర్వీసుల నుంచి నాన్ క్యాడర్ ఐఏఎస్లను డిప్యుటేషన్పై తీసుకొస్తున్నారా అని సీఎం జగన్ను తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు ప్రశ్నించారు. -
వైకాపాకు డిపాజిట్లు వస్తే మనం ఓడిపోయినట్లే..: అచ్చెన్నాయుడు
‘తెదేపా-జనసేనలు కలిశాక గోదావరి జిల్లాల్లో వైకాపాకు డిపాజిట్లు వస్తే మనం ఓడిపోయినట్లే లెక్క..’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. యువగళం పాదయాత్ర సభలో ప్రసంగించారు. -
సామాజిక సాధికార యాత్రకు జనాల తరలింపు
ఏలూరు జిల్లా కైకలూరులో మంగళవారం జరగనున్న వైకాపా సాధికార యాత్రకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణకు అధికారులు, నాయకులు కృషి చేస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand Tunnel: ఏ క్షణమైనా మీ వాళ్లు బయటకు.. కూలీల కుటుంబాలకు సమాచారం
-
Britain-Greek: పురాతన శిల్పాల వివాదం.. ప్రధానుల భేటీ రద్దు
-
Malla Reddy: మహేశ్బాబు ‘బిజినెస్మేన్’ చూసి ఎంపీ అయ్యా.. మల్లారెడ్డి స్పీచ్కు మహేశ్బాబు నవ్వులే నవ్వులు!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Pat Cummins: నా చరమాంకంలోనూ ‘కోహ్లీ వికెట్టే’ గుర్తొస్తుంది: కమిన్స్
-
Digital Payments: ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట.. తొలి UPI చెల్లింపునకు 4 గంటల వ్యవధి?