రాజమహేంద్రవరానికి ధూళిపాళ్ల తరలింపు
సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అరెస్టయిన తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)
విజయవాడ: సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అరెస్టయిన తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు మళ్లీ రాజమహేంద్రవరం తరలించారు. కరోనా సోకడంతో ఇప్పటి వరకు విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. తాజాగా నరేంద్రకు కరోనా నెగటివ్ రావడంతో తిరిగి తీసుకెళ్లారు. తొలుత అరెస్ట్ చేసిన అనంతరం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే ఆయన్ను ఉంచారు. అయితే అక్కడ నరేంద్రకు కరోనా సోకడంతో విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇప్పుడు కోలుకోవడంతో మళ్లీ తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అక్కడ వారంపాటు నరేంద్రను ఐసోలేషన్లోనే ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.
బెయిల్ పిటిషన్ దాఖలు
మరోవైపు ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు కోరుతూ ఏసీబీ కోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. నరేంద్ర కస్టడీని రీకాల్ చేయాలని కోర్టును కోరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Mission venus: 2028లో శుక్రగ్రహ మిషన్!: ఇస్రో అధిపతి సోమనాథ్
-
Ap-top-news News
AP High Court: క్రిమినల్ కేసు ఉంటే కోర్టు అనుమతితోనే పాస్పోర్టు పునరుద్ధరణ: హైకోర్టు
-
Sports News
Suryakumar Yadav: హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్
-
World News
UNO: స్వచ్ఛమైన తాగునీటికి దూరంగా 26 శాతం ప్రపంచ జనాభా