డీఎంకే కూటమిలో ఎప్పుడైనా చీలిక: మురుగన్
డీఎంకే- కాంగ్రెస్ కూటమిలో ఎప్పుడైనా చీలిక రావొచ్చని తమిళనాడు భాజపా అధ్యక్షుడు ఎల్.మురుగన్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ భాగస్వామ్య పార్టీలను.....
చెన్నై: డీఎంకే- కాంగ్రెస్ కూటమిలో ఎప్పుడైనా చీలిక రావొచ్చని తమిళనాడు భాజపా అధ్యక్షుడు ఎల్.మురుగన్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ భాగస్వామ్య పార్టీలను గౌరవించడంలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు కేటాయించినందుకు కాంగ్రెస్ శిబిరం అసంతృప్తితో ఉండటంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. శనివారం తిరువణ్ణామలైలో భాజపా చేపట్టిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా విలేకర్లతో ఆయన మాట్లాడారు. అన్నాడీఎంకే తమకు కేటాయించిన 20 స్థానాల్లో విజయంతో పాటు కూటమిని గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
తమిళనాడులో డీఎంకే చీకటి పాలనకు మళ్లీ అవకాశం ఇవ్వమన్నారు. పొత్తులో భాగంగా అన్నాడీఎంకే తమకు 20 సీట్లు ఇచ్చినట్టు చెప్పారు. ఏయే స్థానాలనుంచి పోటీ చేయాలనే అంశంపై తదుపరి చర్చల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ క్రమంగా పుంజుకుంటుందని మురుగన్ వ్యాఖ్యానించారు. డీఎంకే హయాంలో భూ అక్రమాలు, కంగారూ కోర్టులు, ఇతర కుంభకోణాలు చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. తమిళ ప్రజలకు సంస్కృతికి వ్యతిరేకంగా ఆ పార్టీ పనిచేస్తోందంటూ ధ్వజమెత్తారు. శ్రీలంకలో తమిళ ప్రజల్ని చంపినా మౌనప్రేక్షకుల్లా చూస్తు ఉండిపోయారని ఆరోపించారు. తమిళ ప్రజల అభ్యున్నతికి డీఎంకే చేసిందేమీ లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్