YSRCP: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్‌ నోటీసు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన పలమనేరు ఎమ్మెల్యేపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 19 Mar 2024 18:17 IST

చిత్తూరు: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన పలమనేరు వైకాపా ఎమ్మెల్యే వెంకట గౌడపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ అధికారులు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో వైకాపా నేతల ఎన్నికల కోడ్ ఉల్లంఘన తారస్థాయికి చేరింది. పదో తరగతి పిల్లలకు పలమనేరు ఎమ్మెల్యే.. సోమవారం పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. చాలామంది విద్యార్థులు వాటితోనే పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. దీనిపై తెదేపా నేతలు పలమనేరు RDOకు ఫిర్యాదు చేయగా... కచ్చితంగా అది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తేల్చి చెప్పారు. పరీక్ష కేంద్రంలోనికి వాటిని అనుమతించరాదని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని