విజయసాయిరెడ్డికి అక్కడేం పని?: బచ్చుల
శాసనమండలిలో ఏం జరుగుతుందో తెలియకుండా ప్రసారాలు నిలివేశారని తెదేపా ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, దీపక్రెడ్డి, అశోక్బాబు విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు.
మంగళగిరి: శాసనమండలిలో ఏం జరుగుతుందో తెలియకుండా ప్రసారాలు నిలివేశారని తెదేపా ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, దీపక్రెడ్డి, అశోక్బాబు విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. తెలుగుజాతి కోసం మండలి ఛైర్మన్ షరీఫ్ పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారని బచ్చుల అర్జునుడు అన్నారు. నిండుసభలో మండలి ఛైర్మన్కు మంత్రులు నరకయాతన చూపించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన షరీఫ్కు తెలుగుజాతి అంతా సెల్యూట్ చేస్తోందన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి ఛైర్మన్ గదిలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తోందని, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారని అర్జునుడు విమర్శించారు.
ప్రజల మనోభావాలకు అనుగుణంగానే..: దీపక్రెడ్డి
ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము పోరాటం చేస్తున్నామని ఎమ్మెల్సీ దీపక్రెడ్డి చెప్పారు. మండలిలో ఏంజరుగుతుందో బయటకు తెలియకుండా చేశారని ఆరోపించారు. తెదేపా సభ్యులందరిపైనా వైకాపా సభ్యులు, మంత్రులు దుర్భాషలాడారని విమర్శించారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని మండలి ఛైర్మన్ షరీఫ్ నడుచుకున్నారన్నారు.
అన్నీ చట్ట ప్రకారమే: అశోక్బాబు
మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని నిర్ణయాలూ చట్ట ప్రకారమే జరుగుతాయని ఎమ్మెల్సీ అశోక్బాబు అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటూ మంత్రి బొత్స మాట్లాడుతున్నారని, తొలుత ఆయన చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. వైకాపాకు అధికారం ఆ చట్టం ద్వారానే సంక్రమించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి ప్రజలకు ఏం జరుగుతుందో తెలియనీయలేదని అశోక్బాబు ఆక్షేపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM