‘పీకే’ బెంగాల్ వెళ్లారా? కేంద్రం విచారణ
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కార్గో విమానంలో దిల్లీ నుంచి కోల్కతా వెళ్లారా అని కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టిందని సమాచారం. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఆయన బెంగాల్ చేరుకున్నారా లేదా తనిఖీ చేస్తోందని తెలిసింది. వైమానిక అధికారులు దిల్లీ, కోల్కతా విమానాశ్రయాల పుటేజీలను....
దిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కార్గో విమానంలో దిల్లీ నుంచి కోల్కతా వెళ్లారా? అని కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టిందని సమాచారం. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఆయన బెంగాల్ చేరుకున్నారా లేదా తనిఖీ చేస్తోందని తెలిసింది. వైమానిక అధికారులు దిల్లీ, కోల్కతా విమానాశ్రయాల పుటేజీలను పరిశీలిస్తున్నారట. కాగా విమానంలో తాను కోల్కతాకు వెళ్లలేదని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు.
‘ప్రస్తుత విచారణపై త్వరలోనే నివేదిక అందుతుంది. డీజీసీఏ, విమానాశ్రయ అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు’ అని వైమానిక శాఖ తెలిపింది. ‘గత నాలుగు రోజుల్లో దిల్లీ నుంచి వెళ్లిన మూడు కార్గో విమానాలను తనిఖీ చేశాం. ప్రశాంత్ తమ విమానంలో రాలేదని వారు ధ్రువీకరించారు. దిల్లీ, కోల్కతా విమానాశ్రయ పుటేజీలనూ పరిశీలించగా ఆయన జాడ తెలియలేదు. ఈ మధ్య కాలంలో ఎయిర్ అంబులెన్స్లు సైతం వెళ్లలేదు’ అని మరో అధికారి తెలిపారు.
కరోనా కట్టడి చేయడంలో మమతా బెనర్జీ పూర్తిగా విఫలమైందని భాజపా విమర్శిస్తోంది. ఏం చేయాలో తెలియని ఆమె వ్యూహం రచించేందుకు ప్రశాంత్ను బెంగాల్కు పిలిపించారని సమాచారం. లాక్డౌన్ ఉన్నప్పటికీ ఓ కార్గో విమానంలో ఆయన కోల్కతా చేరుకున్నారని వార్తా కథనాలు వచ్చాయి.
చదవండి: కరోనాను చంపేందుకు క్రిమిసంహారకాలను ఎక్కిస్తే: ట్రంప్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?