అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారు: చంద్రబాబు
మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత కింజరావు అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం చేస్తున్న మోసాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడిపై
అమరావతి: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత కింజరావు అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం చేస్తున్న మోసాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడిపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. దాదాపు 100 మంది పోలీసులు అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేశారని ఆరోపించారు. కనీసం మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదని, వారి కుటుంబ సభ్యులు ఫోన్లో కాంటాక్ట్ చేసినా ఫోన్ అందుబాటులో లేకుండా చేశారని తెలిపారు. జగన్ ఉన్మాదం, పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అచ్చెన్నాయుడిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సీఎం జగన్, హోం మంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి. శాసనసభాపక్ష ఉప నేతగా ఉన్న అచ్చెన్నాయుడికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కిడ్నాప్ చేయడం చట్టాన్ని ఉల్లంఘించడం కాక మరేమిటి? బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. బీసీ సబ్ప్లాన్ నిధులు మళ్లించారు. ముఖ్యమైన నామినేటెడ్ పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపించారు. సంక్షేమ పథకాల్లో కోత విధించారు. వీటన్నింటినీ శాసనసభ వేదికగా ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నాయుడిని చట్ట వ్యతిరేకంగా కిడ్నాప్ చేశారు. ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యకు నిరసనగా బడుగు బలహీనవర్గాల ప్రజలు నిరసనలు తెలియజేయాలి. జ్యోతిరావుపూలే,అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసన తెలియజేయాలి’’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
-
రూ.7 వేలకోట్ల రుణానికి ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
-
జగన్ ఇష్టారాజ్యం చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
-
వైకాపా మార్క్ ’పీనల్ కోడ్’: పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?
-
మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్