Vishal: కుప్పంలో పోటీపై సినీ నటుడు విశాల్‌ క్లారిటీ

రానున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులేనని సినీనటుడు విశాల్‌ అన్నారు.

Updated : 19 Dec 2022 07:15 IST

చెన్నై (కోడంబాక్కం), న్యూస్‌టుడే: రానున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులేనని సినీనటుడు విశాల్‌ అన్నారు. తాను నటించిన ‘లత్తి’ (లాఠీ) సినిమాకు సంబంధించి చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆదివారం విశాల్‌ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లోకి రావడం తథ్యం. సామాజిక సేవే ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తా. అయితే 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై పోటీకి దిగుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కుప్పం, ఆ ప్రాంత ప్రజలతో నాకు అనుబంధం ఉంది. అక్కడ మా నాన్న గ్రానైట్‌ వ్యాపారం చేసేవారు. మూడేళ్లపాటు అక్కడే ఉన్నా’ అని పేర్కొన్నారు. ఇక మరో ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని