Vishal: కుప్పంలో పోటీపై సినీ నటుడు విశాల్ క్లారిటీ
రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులేనని సినీనటుడు విశాల్ అన్నారు.
చెన్నై (కోడంబాక్కం), న్యూస్టుడే: రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులేనని సినీనటుడు విశాల్ అన్నారు. తాను నటించిన ‘లత్తి’ (లాఠీ) సినిమాకు సంబంధించి చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆదివారం విశాల్ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లోకి రావడం తథ్యం. సామాజిక సేవే ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తా. అయితే 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై పోటీకి దిగుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కుప్పం, ఆ ప్రాంత ప్రజలతో నాకు అనుబంధం ఉంది. అక్కడ మా నాన్న గ్రానైట్ వ్యాపారం చేసేవారు. మూడేళ్లపాటు అక్కడే ఉన్నా’ అని పేర్కొన్నారు. ఇక మరో ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM