Eatala Rajender: నాపై కేసీఆర్ దుష్ప్రచారం చేయిస్తున్నారు: ఈటల
భాజపాను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
ఆర్మూర్ పట్టణం, న్యూస్టుడే: భాజపాను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సోమవారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారతారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై విలేకరులు ప్రశ్నించగా తనపై ముఖ్యమంత్రి దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ‘నేను ఒక పార్టీని నమ్ముకుంటే చివరిదాకా కొనసాగుతాను. కేసీఆర్ వెళ్లగొడితే భాజపా నన్ను అక్కున చేర్చుకుని సముచిత స్థానం కల్పించింది. ఇతర పార్టీల్లో చిచ్చుపెట్టి గెలిచేందుకు ఆయన చిల్లర రాజకీయాలకు తెరలేపారు’ అని విమర్శించారు.
ముందస్తుకు పోయే దమ్ము కేసీఆర్కు లేదు: ఎంపీ అర్వింద్
ఈనాడు, దిల్లీ: ముందస్తు ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం సీఎం కేసీఆర్కు లేవని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ కుటుంబంలోని నలుగురి జీవితాలు తప్ప సామాన్యుల జీవన స్థితిగతులు మెరుగుపడలేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని భారాస ఎంపీలు బహిష్కరించినా ఏమీ కాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?