Yuvagalam: యువగళం సభకు పోలీసుల ఆటంకం
నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా సభలకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు. శుక్రవారం సౌండ్ వాహనాన్ని సీజ్ చేశారు.
బంగారుపాళ్యంలో మాట్లాడనీయకపోవడంతో భవనం ఎక్కి ప్రసంగించిన లోకేశ్
మూడు వాహనాలు సీజ్ చేసిన పోలీసులు
సుమారు గంటసేపు ఉద్రిక్తత
ఈనాడు డిజిటల్-చిత్తూరు, న్యూస్టుడే-ఐరాల, బంగారుపాళ్యం, పూతలపట్టు, తవణంపల్లె: నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా సభలకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు. శుక్రవారం సౌండ్ వాహనాన్ని సీజ్ చేశారు. దీంతో లోకేశ్ నిచ్చెన ఎక్కి జాతీయజెండా చేతబట్టుకుని ప్రజలు, కార్యకర్తల మధ్య నిలబడ్డారు. అంతకుముందు చిన్న ప్రచారరథాన్నీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మొగిలి నుంచి లోకేశ్ ఎనిమిదో రోజు పాదయాత్ర ప్రారంభించారు. మధ్యాహ్నం పోలీసులు భారీగా మోహరించారు. పాదయాత్రగా వస్తున్న లోకేశ్.. తాను నిచ్చెనపైనుంచే మాట్లాడతానని చెప్పినా పోలీసులు అంగీకరించకపోవడంతో తెదేపా కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినదించారు. సమీపంలో ఉన్న భవనం ఎక్కి సాయంత్రం 5.10 నుంచి 24 నిమిషాలపాటు మాట్లాడారు. ‘యువగళం అంటే నీకెందుకంత భయం జగన్? ఖాకీలను అడ్డుపెట్టుకుని పాదయాత్ర, బహిరంగ సభలను అడ్డుకుంటున్నావు. మధ్యలో వాళ్లెందుకు.. నేరుగా నువ్వే రా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదు.. పవన్కల్యాణ్ వారాహీ ఆగదు. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళతాం’ అంటూ సీఎంను లోకేశ్ హెచ్చరించారు.
* సాయంత్రం సమయంలో సౌండ్ వాహనాన్ని సీజ్చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. 6.15 సమయంలో తాళాలు ఇచ్చినా, మళ్లీ వెంటనే అడ్డుకోవడంతో తెలుగుదేశం కార్యకర్తలు బైఠాయించారు. అనంతరం లోకేశ్ వచ్చి, నిచ్చెన వేసుకుని జాతీయజెండా పట్టుకుని నిలబడ్డారు. సాయంత్రం 6.45 గంటలకు తిరిగి పాదయాత్ర మొదలుపెట్టారు. వంద కిలోమీటర్లు పూర్తవడంతో తగ్గువారిపల్లెకు సమీపంలో ఉచిత డయాలసిస్ కేంద్రం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఎన్కౌంటర్ చేస్తామని బెదిరింపులు
రొంపిచెర్ల: ‘తెదేపాలో తిరిగితే ఎన్కౌంటర్ చేస్తానని కల్లూరు సీఐ ఆశీర్వాదం బెదిరిస్తున్నారు సార్.. ఇటీవలి బ్యానర్ల గొడవలో జడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్రెడ్డి తన అనుచరులతో మాపై దాడి చేయించారు’ అని రొంపిచెర్ల తెదేపా ముస్లిం నాయకులు లోకేశ్ వద్ద వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM