ఎన్ఎస్యూఐ నాయకుల అరెస్టు చట్టవిరుద్ధం
విద్యారంగ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు పంపడాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్లు ఓ సంయుక్త ప్రకటనలో ఖండించారు.
రేవంత్రెడ్డి, మహేశ్కుమార్గౌడ్
గాంధీభవన్, న్యూస్టుడే: విద్యారంగ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు పంపడాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్లు ఓ సంయుక్త ప్రకటనలో ఖండించారు. సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు తరలించడం చట్టవిరుద్ధమని వారు పేర్కొన్నారు.
* అదానీ ఆస్తులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో విచారణ జరిపించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆయన శనివారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
* ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్కను టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్రెడ్డి కోరారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి చల్లా నర్సింహారెడ్డితో కలిసి ఆయన శనివారం సీఎల్పీ కార్యాలయంలో భట్టిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.