కేంద్ర ప్రభుత్వం మౌనం వీడాలి..
హిండెన్బర్గ్ నివేదికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ మౌనం వీడాలని భారాస ఎంపీలు డిమాండ్ చేశారు.
‘హిండెన్బర్గ్ నివేదిక’పై జేపీసీ వేయాలంటూ పార్లమెంట్లో భారాస ఎంపీల నిరసన
ఈనాడు, దిల్లీ: హిండెన్బర్గ్ నివేదికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ మౌనం వీడాలని భారాస ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై సభలో చర్చకు అనుమతించాలంటూ భారాస పార్లమెంటరీ పార్టీ, లోక్సభాపక్ష నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు మంగళవారం ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వాటిని తిరస్కరించడంతో భారాస ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభల వాయిదా అనంతరం ఇతర విపక్ష సభ్యులతో కలిసి పార్లమెంట్ మొదటి అంతస్తు నుంచి నిరసన వ్యక్తంచేశారు. హిండెన్బర్గ్ నివేదికపై వాస్తవాల వెలికితీతకు జేపీసీ ఏర్పాటు చేయాలంటూ భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. నిరసన కార్యక్రమాల్లో భారాస లోక్సభాపక్ష ఉప నేత కొత్త ప్రభాకర్రెడ్డి, ఎంపీలు గడ్డం రంజిత్రెడ్డి, బొర్లకుంట వెంకటేష్ నేత, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్రెడ్డి, పి.రాములు, పసునూరి దయాకర్, కేఆర్ సురేశ్రెడ్డి, జోగినపల్లి సంతోష్కుమార్, వద్దిరాజు రవిచంద్ర, దివకొండ దామోదర్రావు, బడుగుల లింగయ్యయాదవ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ