భారత్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలి
భారతదేశంలోని చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా పార్టీ ప్రవాస విభాగం విదేశాల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.
ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఆస్ట్రేలియాలో భారాస ప్రవాస నేతల ప్రచారం
ఈనాడు, హైదరాబాద్: భారతదేశంలోని చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా పార్టీ ప్రవాస విభాగం విదేశాల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద భారాస నేతలు ప్లకార్డులను ప్రదర్శించారు. పార్టీ ప్రవాస విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాల, ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు సంగీత ధూపాటి, మహిళా నేతలు స్వప్న, గుల్షన్, అమ్రీన్, రాజేశ్, రవిశంకర్, పరశురామ్, అజాజ్, ఇస్మాయిల్, చిరాన్ తదితరులు పాల్గొని కవితకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లపై అన్ని దేశాల్లోనూ విస్తృత ప్రచారం నిర్వహిస్తామని, ఎమ్మెల్సీ కవిత లక్ష్యం సాధించేంత వరకు ఆమె వెంటే ఉంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్