Vidadala Rajini: మంత్రి రజినిపై అసమ్మతి గళం.. వ్యతిరేకంగా అభ్యర్థిని నిలుపుతామని హెచ్చరిక
రానున్న ఎన్నికల్లో మంత్రి విడదల రజినికి టికెట్ ఇస్తే తాము సహకరించబోమని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వైకాపా అసమ్మతి నాయకులు స్పష్టం చేశారు.
గోరంట్ల(గుంటూరు), న్యూస్టుడే: రానున్న ఎన్నికల్లో మంత్రి విడదల రజినికి టికెట్ ఇస్తే తాము సహకరించబోమని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వైకాపా అసమ్మతి నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు గుంటూరులోని ఓ హోటల్లో గురువారం పల్నాడు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ బీద మస్తాన్రావును అసమ్మతి వర్గం కలిసింది. చిలకలూరిపేటటౌన్, నాదెండ్ల, యడ్లపాడు మండలాల నుంచి అసమ్మతి నాయకులు ఎంపీని కలిసి మాట్లాడారు. నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదని వారు ఫిర్యాదు చేశారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఆమే (రజిని) ఉంటారని ఇటీవల ప్రకటించారని, ఆమెకే టికెట్ ఇస్తే తాము సహకరించబోమని స్పష్టం చేశారు. ఆమెను మార్చకపోతే తామే స్వతంత్ర అభ్యర్థిని పోటీలో నిలబెడతామన్నారు. ఎంపీ మస్తాన్రావు వారితో మాట్లాడుతూ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, సమస్యలపై మాట్లాడి సర్దుబాటు చేసుకుందామని చెప్పినట్లు సమాచారం. అసంతుష్ట నాయకులు మాత్రం తమ నిర్ణయంలో మార్పు ఉండదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎంపీని కలిసిన వారిలో నాదెండ్ల మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డి, నాయకులు గొంటు శ్రీనివాసరెడ్డి, కోవెలమూడి సాంబశివరావు, చల్లా యఘ్నేశ్వరరెడ్డి, జాలాది సుబ్బారావు, గంటా హరికృష్ణ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్