బస్సుయాత్రతో తెదేపా బలోపేతం: కాసాని

తెదేపాకు అనుబంధ సంఘాలే వెన్నెముక అని, త్వరలో ప్రారంభమయ్యే బస్సుయాత్రతో పార్టీని బలోపేతం చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు.

Published : 06 Jun 2023 03:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపాకు అనుబంధ సంఘాలే వెన్నెముక అని, త్వరలో ప్రారంభమయ్యే బస్సుయాత్రతో పార్టీని బలోపేతం చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపా అనుబంధ సంఘాల అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. బస్సుయాత్రలో అనుబంధ సంఘాల సభ్యులు పూర్తిస్థాయిలో పాల్గొనాలని కోరారు. అనుబంధ సంఘాలు కష్టపడి పనిచేస్తేనే తెదేపా పటిష్ఠమవుతుందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని క్షేత్రస్థాయిలో గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటాలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తెదేపా నాయకులు సామ భూపాల్‌రెడ్డి, జక్కలి ఐలయ్యయాదవ్‌, శ్రీపతి సతీష్‌, షకీలారెడ్డి, పొగాకు జయరాం పి.అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని