devineni Uma: తెదేపా బిల్డరయితే.. వైకాపా పెయింటరు.. కొడాలి నానిపై దేవినేని మండిపాటు
తమ ప్రభుత్వహయాంలో కట్టిన ఇళ్లకు వైకాపా వారు రంగులేసుకొని తామే నిర్మించినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
ఇబ్రహీంపట్నం, న్యూస్టుడే: తమ ప్రభుత్వహయాంలో కట్టిన ఇళ్లకు వైకాపా వారు రంగులేసుకొని తామే నిర్మించినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, వైకాపా నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టిడ్కో ఇళ్లను తెదేపా హయాంలో కట్టామన్న సంగతి కొడాలికి తెలియదా అని దేవినేని ఉమా ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాలుగేళ్లుగా మూలన పడిన టిడ్కో ఇళ్లకు రంగులేసి తమ గొప్పగా వైకాపా ప్రభుత్వం చెప్పుకోవడం అర్థరహితమన్నారు. భవనాలు నిర్మించిన వారిని బిల్డర్లని, రంగులు వేసినవారిని పెయింటర్లని అంటారన్నారు. వైకాపా వారు పెయింటర్లు మాత్రమేనని తేల్చి చెప్పారు. ఆ ఇళ్లలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకపోగా, వాటి ధరలను పెంచి లబ్ధిదారులకు ఇవ్వడం హేయమన్నారు. తెదేపా హయాంలో 12 లక్షల ఇళ్లు నిర్మించామన్నారు. నాలుగేళ్లలో వైకాపావారు కట్టిన ఇళ్లు ఏవో చెప్పాలని డిమాండు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.