devineni Uma: తెదేపా బిల్డరయితే.. వైకాపా పెయింటరు.. కొడాలి నానిపై దేవినేని మండిపాటు

తమ ప్రభుత్వహయాంలో కట్టిన ఇళ్లకు వైకాపా వారు రంగులేసుకొని తామే నిర్మించినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

Updated : 17 Jun 2023 09:17 IST

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: తమ ప్రభుత్వహయాంలో కట్టిన ఇళ్లకు వైకాపా వారు రంగులేసుకొని తామే నిర్మించినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, వైకాపా నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టిడ్కో ఇళ్లను తెదేపా హయాంలో కట్టామన్న సంగతి కొడాలికి తెలియదా అని దేవినేని ఉమా ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాలుగేళ్లుగా మూలన పడిన టిడ్కో ఇళ్లకు రంగులేసి తమ గొప్పగా వైకాపా ప్రభుత్వం చెప్పుకోవడం అర్థరహితమన్నారు. భవనాలు నిర్మించిన వారిని బిల్డర్లని, రంగులు వేసినవారిని పెయింటర్లని అంటారన్నారు. వైకాపా వారు పెయింటర్లు మాత్రమేనని తేల్చి చెప్పారు. ఆ ఇళ్లలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకపోగా, వాటి ధరలను పెంచి లబ్ధిదారులకు ఇవ్వడం హేయమన్నారు. తెదేపా హయాంలో 12 లక్షల ఇళ్లు నిర్మించామన్నారు. నాలుగేళ్లలో వైకాపావారు కట్టిన ఇళ్లు ఏవో చెప్పాలని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని