Minister Roja: చంద్రబాబు రిమాండు.. సంబరాలు చేసుకున్న ఏపీ మంత్రి రోజా
తెదేపా అధినేత చంద్రబాబు రిమాండు నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరిలోని తన నివాసంలో మంత్రి రోజా ఆదివారం రాత్రి సంబరాలు చేసుకున్నారు.
నగరి, న్యూస్టుడే: తెదేపా అధినేత చంద్రబాబు రిమాండు నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరిలోని తన నివాసంలో మంత్రి రోజా ఆదివారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అచ్చెన్నాయుడు, లోకేశ్ పాత్రధారులైతే రోజులు లెక్కపెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తప్పులన్నింటికీ రిటన్ గిఫ్ట్ వస్తుందని విమర్శించారు.
చట్టం తన పని తాను చేస్తుంది: బూడి ముత్యాలనాయుడు
దేవరాపల్లి: చట్టం తన పని తాను చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉండటం వల్లే కోర్టు రిమాండు విధించిందని అనకాపల్లి జిల్లా తారువ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు: మంత్రి ధర్మాన
శ్రీకాకుళం నగరం: కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఇది సరికాదన్నారు. శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్ర సంస్థలే స్కిల్ డెవలప్మెంట్ నిధుల దుర్వినియోగం నిర్ధారించాయి. దీనిపై రాష్ట్రంలోని సంస్థ విచారణ చేయకపోతే చెడ్డ పేరొస్తుంది’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.