సిర్పూర్ బరిలో ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) విడుదల చేసింది. 20 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ మంగళవారం ప్రకటించారు.
20 మందితో బీఎస్పీ తొలి జాబితా
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) విడుదల చేసింది. 20 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ మంగళవారం ప్రకటించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ జనరల్ స్థానం నుంచి ప్రవీణ్కుమార్ పోటీ చేయనున్నారు. తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్కుమార్ 2021లో అదనపు డీజీపీ హోదాలో రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన విషయం తెలిసిందే. తొలుత రాష్ట్ర పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సిర్పూర్ నుంచి పోటీ చేయనున్నట్లు జులైలోనే ప్రకటించిన ప్రవీణ్కుమార్.. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కొంతకాలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ భారాస ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్ప.. 2014 ఎన్నికల్లో బీఎస్పీ బీఫాంపైనే ఎన్నికవడం గమనార్హం. ఇటీవల కాలంలో పలు కేసులతో వివాదాస్పదంగా మారిన ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ వట్టె జానయ్యయాదవ్కు జాబితాలో చోటు దక్కడం చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట జనరల్ స్థానం నుంచి ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు. ఖరగ్పుర్ ఐఐటీలో ఇంజినీరింగ్ చదివిన దాసరి ఉషకు పెద్దపల్లి అభ్యర్థిత్వం దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్