Kadiri MLA Sidda Reddy: నెల పింఛన్లు ఆపితే రోడ్లు అద్దంలా చేయొచ్చు: కదిరి ఎమ్మెల్యే
సామాజిక పింఛన్లు ఒక నెల పంపిణీ చేయడం ఆపితే రోడ్లు అద్దంలా చేయొచ్చని శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పి.వి.సిద్ధారెడ్డి అన్నారు.
తనకల్లు, న్యూస్టుడే: సామాజిక పింఛన్లు ఒక నెల పంపిణీ చేయడం ఆపితే రోడ్లు అద్దంలా చేయొచ్చని శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పి.వి.సిద్ధారెడ్డి(Kadiri MLA Sidda Reddy) అన్నారు. తనకల్లు మండలంలోని చిన్నరామన్నగారిపల్లి పంచాయతీ తురకవాండ్లపల్లి గ్రామస్థులు పది మందికిపైగా శుక్రవారం కదిరిలోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చారు. తమ గ్రామ రహదారి అధ్వానంగా ఉందని, రోడ్డు వేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ఒక నెలైనా వృద్ధులు పింఛను ఇవ్వకుంటే ఒప్పుకొంటారా? ప్రతి నెలా 1న కదిరికే రూ.15 కోట్ల పింఛన్ల సొమ్ము వస్తోంది. అవి ఆపి రహదారుల నిర్మాణానికి వెచ్చిస్తే రోడ్లన్నీ అద్దంలా తయారుచేయొచ్చు. మొదటి ప్రాముఖ్యం వాటికి (పింఛన్లు).. తరువాత ఏవైనా..’ అని అన్నారు. ఎమ్మెల్యే మాటలతో కంగుతిన్న గ్రామస్థులు నిరాశతో వెనుదిరిగారు.
నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం
బందార్లపల్లి రహదారి నుంచి తురకవాండ్లపల్లి గ్రామంలోకి రెండు కి.మీ.మేర రోడ్డు కంకర తేలి గుంతలు పడి రాకపోకలు సాగించేందుకు అనువుగా లేదు. అధ్వానమైన రహదారిపై రాకపోకలు సాగించే క్రమంలో వృద్ధులు, గర్భిణులు ప్రమాదాలకు గురవుతున్నారు. నాలుగేళ్లనుంచి ఈ రహదారి మరమ్మతు, నిర్వహణ చేపట్టకపోవడంతో రోడ్డు నామరూపాల్లేకుండా పోయింది. దీంతో స్థానికులు అవస్థలు పడటంతోపాటు ఆసుపత్రుల పాలవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?