YSRCP: విశాఖ లోక్‌సభ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ?

విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పేరును ఆ పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోంది.

Updated : 08 Jan 2024 07:38 IST

ఈనాడు, అమరావతి: విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పేరును ఆ పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోంది. అక్కడి నుంచి వైకాపా తరఫున పోటీ చేస్తామంటూ అడిగేవారు లేకపోవడంతో.. అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య అయిన ఝాన్సీ పేరును ప్రతిపాదించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమె విజయనగరం నుంచి ఎంపీగా పనిచేశారు. విశాఖపట్నం సిట్టింగ్‌ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ దఫా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రతిపాదించడంతో ఆయనకు అక్కడ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని