Nara Lokesh: వైకాపాకు అంతిమయాత్ర పక్కా.. ‘ఇండియా టుడే’ సర్వేపై లోకేశ్‌ స్పందన

వచ్చే ఎన్నికల్లో తెదేపా 17 లోక్‌సభ స్థానాలను గెలుచుకోబోతోందంటూ ఇండియా టుడే- సి ఓటర్‌ సర్వే వెల్లడించడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో స్పందించారు.

Updated : 09 Feb 2024 08:14 IST

ఈనాడు, అమరావతి: వచ్చే ఎన్నికల్లో తెదేపా 17 లోక్‌సభ స్థానాలను గెలుచుకోబోతోందంటూ ఇండియా టుడే- సి ఓటర్‌ సర్వే వెల్లడించడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘వైసీపీకి అంతిమయాత్ర పక్కా! సైకో పోతున్నాడు, సైకిల్‌ వస్తోందని ఇండియా టుడే- సి ఓటర్‌ సర్వే చెప్పింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ సర్వే వివరాలతో ఆజ్‌తక్‌ ఛానల్‌ (ఇండియా టుడే, ఆజ్‌తక్‌ ఒకే గ్రూప్‌ ఛానళ్లు) ప్రసారం చేసిన చిత్రాన్ని జత చేశారు. ‘ఏపీలో 45 శాతం ఓటర్లు తెదేపా-జనసేనతో ఉన్నారు. ఈ రెండు పార్టీలు 17 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటాయి. 41 శాతం ఓట్లతో వైకాపా 8 స్థానాలకు పరిమితం కానుంది’ అని ఆ ఛానల్‌ సర్వేలో పేర్కొన్న విషయాలను లోకేశ్‌ ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని