Vijayawada: సీటు ఇవ్వకుంటే పవన్‌కల్యాణ్‌ బొమ్మతో పోటీ చేస్తా: పోతిన మహేష్‌

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకు ఇవ్వకుంటే పవన్‌కల్యాణ్‌ బొమ్మ పెట్టుకుని పోటీచేస్తానని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్‌ ప్రకటించారు.

Updated : 17 Mar 2024 07:14 IST

విజయవాడ (చిట్టినగర్‌), న్యూస్‌టుడే: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకు ఇవ్వకుంటే పవన్‌కల్యాణ్‌ బొమ్మ పెట్టుకుని పోటీచేస్తానని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్‌ ప్రకటించారు. ఈ సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించడంలో కుట్ర ఉందని పేర్కొన్నారు. విజయవాడలోని చిట్టినగర్‌లో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద శనివారం మహాధర్నా నిర్వహించారు. మహేష్‌ మాట్లాడుతూ.. ‘జనసేన ఆవిర్భావం నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డాను. అధికారపార్టీ అవినీతిపై పోరాటాలు చేస్తే ఎన్నో కేసులు పెట్టారు. ఇక్కడ జనసేన తరఫున బలంగా ఉండటం వల్లే స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పక్క నియోజకవర్గానికి పారిపోయారు. నాలాంటి నాయకుడికి టికెట్‌ ఇవ్వకుండా అన్యాయం చేయడం బాధాకరం. అధినేత పవన్‌కల్యాణ్‌ నా సేవలను గుర్తించి పునరాలోచన చేయాలి. లేదంటే ఆయన బొమ్మతో బరిలోకి దిగుతా’ అని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని