Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,668

Stock Market Opening bell: ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్‌ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 22,668 దగ్గర కొనసాగుతోంది.

Published : 30 Apr 2024 09:30 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు భారత్‌కు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్‌ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 22,668 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.49 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టైటన్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 88.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ సోమవారం నికరంగా రూ.169.09 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.692.05 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని