కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ?
కడప లోక్సభ స్థానం నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం
ఈనాడు, అమరావతి: కడప లోక్సభ స్థానం నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు కడప నుంచి బరిలో దిగే అవకాశం ఉందని, కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాలో షర్మిల పేరు ఉండనున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత పోటీ చేస్తారని, వారి విజయానికి షర్మిల సహకరిస్తారని ఇప్పటివరకు రాజకీయ వర్గాలు భావించాయి. మరోవైపు సునీత పోటీ చేస్తే ఏకగ్రీవంగా మద్దతిస్తామంటూ ఈ నెల 15న కడపలో నిర్వహించిన వివేకా అయిదో వర్ధంతి కార్యక్రమంలో.. తెదేపా, భాజపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు ప్రకటించారు.ఆ కార్యక్రమంలో షర్మిల క్రియాశీలకంగా వ్యవహరించారు. ‘‘వివేకాను హత్య చేసిన, చేయించిన వ్యక్తులను, వారిని కాపాడుతున్నవారిని ప్రజాకోర్టులో శిక్షించాలి. కోర్టులో న్యాయం జరగడం ఆలస్యం కావొచ్చు. ఇప్పుడు ప్రజాకోర్టులో వారందరికీ గుణపాఠం చెబుదాం’’ అంటూ ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. సునీత పోరాటంలో అండగా ఉంటానన్నారు. అలాంటిది ప్రస్తుతం కడప నుంచి షర్మిల బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!