YSRCP: పిఠాపురంలో పార్టీని నిలబెట్టండి.. ఎమ్మెల్యేను కోరిన సీఎం జగన్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనుండటంతో.. ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి వైకాపా అధిష్ఠానం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
ఈనాడు, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనుండటంతో.. ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి వైకాపా అధిష్ఠానం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును స్వయంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం తాడేపల్లికి పిలిపించుకుని మాట్లాడారు. పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దొరబాబుకు ఈసారి టికెట్ ఇవ్వకుండా కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలో నిలిపారు. అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న దొరబాబును సీఎం పిలిపించుకుని మాట్లాడి సర్దుబాటుకు ప్రయత్నించారు. ‘పవన్ పోటీ చేస్తున్నారు, ఈ సమయంలో అక్కడ పార్టీని బలోపేతం చేయాలి. మీరు పూర్తిస్థాయిలో సహకరిస్తేనే పార్టీ నిలబడగలదు. పొరపొచ్చాలు లేకుండా కలిసి పనిచేసి, పార్టీని నిలబెట్టండి’ అని సీఎం విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. తన సీటు తనకు కేటాయించాలని గతంలోనే దొరబాబు కోరారు. ఇవ్వకపోవడంతో.. ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో కనీసం తన సామాజికవర్గం తరఫున రాజ్యసభకు అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థనలను వేటినీ వైకాపా అధినాయకత్వం పరిగణనలోకి తీసుకోలేదు. అలాంటిది ఇప్పుడు ముఖ్యమంత్రే స్వయంగా పిలిచి మాట్లాడటం గమనార్హం. సీఎంతో భేటీ తర్వాత దొరబాబు అక్కడే విలేకర్లతో మాట్లాడుతూ.. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ను ఓడించాలని, వైకాపా అభ్యర్థి వంగా గీతను గెలిపించుకురావాలని నన్ను సీఎం ఆదేశించారు. అలాగే పని చేస్తానని ఆయనకు చెప్పా’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!