మెగా డీఎస్సీపైనే తొలి సంతకం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తూనే తొలిరోజు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని, 60 రోజుల్లోనే పరీక్ష నిర్వహిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు.
60 రోజుల్లో పరీక్ష.. ఉద్యోగాల భర్తీ
వాలంటీర్ల ఉద్యోగాలు తీయం.. మెరుగైన జీవితం ఇస్తాం
100 రోజుల్లో డ్రగ్స్, గంజాయి, ‘జె’ బ్రాండ్ మద్యం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా
కుప్పం పర్యటనలో చంద్రబాబు హామీలు
ఈనాడు, చిత్తూరు: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తూనే తొలిరోజు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని, 60 రోజుల్లోనే పరీక్ష నిర్వహిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు చరిత్రలో లేనివిధంగా 1.50 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చిన ఘనత తమకు ఉందన్నారు. ఇప్పుడూ అలాగే చరిత్ర సృష్టిస్తామని, ఎన్ని పోస్టులుంటే అన్నీ భర్తీ చేస్తామన్నారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని, డీఎస్సీ నిర్వహిస్తానని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే వేల కోట్ల రూపాయలు సంపాదించారని.. యువతకు మాత్రం వాలంటీర్లు, ఫిష్, మటన్ మార్ట్ ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. యువత మేల్కొని.. వారి జీవితాలను చీకటిమయం చేసిన జగన్ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో సొంత నియోజకవర్గం కుప్పంలో రెండోరోజు మంగళవారం తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.
వాలంటీర్ల మేలుకు ప్రణాళిక
‘వాలంటీర్ల వ్యవస్థకు మేం వ్యతిరేకం కాదు. తెదేపా అధికారంలోకి వస్తే వారి ఉద్యోగాలు తీయం. మెరుగైన ఉద్యోగాలు ఇస్తాం. ఇంజినీరింగ్ పూర్తిచేసిన వాళ్లూ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. వారంతా బయటకు రావాలి. రూ.5 వేల జీతం బదులు.. నైపుణ్య శిక్షణతో ఇంటి నుంచే రూ.30 వేలు- రూ.50 వేలు సంపాదించుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఎన్నికల సమయంలో వాలంటీర్లు తటస్థులుగా ఉండాలి. రూ.5 వేల జీతం కోసం వైకాపా నాయకులు చెప్పే తప్పుడు పనులు చేసి జైళ్లకు వెళ్లొద్దు. తెలుగుదేశం కార్యకర్తలు.. వాలంటీర్ల దగ్గరకు వెళ్లి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి వివరించాలి’ అని చంద్రబాబు చెప్పారు. ఈసారి కరడుగట్టిన వైకాపా కార్యకర్తలు కూడా తెదేపా, మిత్రపక్షాలకు ఓటేస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
కుంభకోణాలు చేసే వ్యక్తి జగన్
‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చా. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక్క రూపాయైనా పెట్టుబడి వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చాయా? పైగా జాకీ, అమరరాజ లాంటి పరిశ్రమలను తరిమేశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలోనే హిందూపురం వద్ద లేపాక్షి నాలెడ్జ్ హబ్కు భూములిచ్చారు. అదే కుంభకోణమైతే.. రూ.10 వేల కోట్ల విలువైన ఆ భూములను కొట్టేయాలని జగన్ మేనమామ టెండర్ పెట్టారు. జగన్మోహన్రెడ్డి కుంభకోణాల్లోనే కుంభకోణాలు చేసే వ్యక్తి’ అని ధ్వజమెత్తారు. ప్రజలు వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించి, శాశ్వతంగా భూస్థాపితం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాష్ట్రాభివృద్ధి కోసమే కలిశాం
‘జనసేనకు తక్కువ సీట్లు ఇచ్చారని కొందరు, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఎందుకు తక్కువ సీట్లు తీసుకోవాలని కొందరు అంటున్నారు. సీట్ల కోసం మేం కలవలేదు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే కలిశాం. జెండాలు మూడైనా మా ఎజెండా ఒక్కటే’ అని చంద్రబాబు తెలిపారు. ఏ రంగంలోనూ అడ్డదారిలో విజయాలు రావని.. లక్ష్య సాధనకు నిరంతర కృషి చేయాలన్నారు. ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తయిన తర్వాత ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలనుకున్నానని, రాజకీయాల్లోకి వస్తే అఖిల భారత సర్వీసు అధికారులతో ప్రజలకు మంచి పనులు చేయించవచ్చని గుర్తించి, ఈ రంగాన్ని ఎంచుకున్నానన్నారు. 1978లో ఎమ్మెల్యే కాకముందు మూడేళ్లు ఇల్లిల్లూ తిరిగానని.. శాసనసభ్యుడైన తర్వాత నా సామర్థ్యాన్ని చూసి మంత్రి పదవి ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని అడిగానన్నారు. తర్వాత రెండేళ్లకు అమాత్యుడినయ్యానని గుర్తుచేశారు. ఆనంద్ అనే యువకుడు తాను ఇప్పుడు టీమ్ లీడర్గా ఏడాదికి రూ.25 లక్షలు సంపాదిస్తున్నానని చంద్రబాబుకు చెప్పారు. తాను ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని, లక్షల మంది ఇప్పుడు మంచి జీతాలు సంపాదిస్తున్నారన్నారు. బిలియన్ డాలర్ల కంపెనీలు స్థాపించామని చెబుతుంటే సంతోషంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.
యువతను మోసగించిన జగన్
‘జగన్ ప్రభుత్వం గ్రూప్- 1 ఉద్యోగాలను అమ్ముకుని ఆర్డీవోలు, డీఎస్పీలు కావాల్సిన లక్షల మంది యువతను మోసం చేసింది. పిల్లల భవిష్యత్తును అంధకారం చేసిన సర్వీస్ కమిషన్ ఉద్యోగులను శిక్షిస్తాం. ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. నిరుద్యోగ అభ్యర్థులంతా ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికల తర్వాత పరీక్ష జరపాలని విజ్ఞప్తి చేయండి. మాజీ మంత్రి ఒకరు హోటల్లో సర్వర్గా పనిచేస్తూ వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. అంటే అందరూ ఆయనలా హోటల్లో పనిచేయాలా? తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హెరాయిన్, గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. మద్యానికి బానిసలైన వారిని విముక్తి చేయడానికి మండలానికో సైకాలజిస్ట్ను నియమిస్తాం’ అని చంద్రబాబు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం