చంద్రబాబుపై రాయి విసిరిన సంఘటనపై విచారించాలి

విశాఖలోని గాజువాకలో ఆదివారం రాత్రి తెదేపా ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పార్టీ అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు.

Published : 16 Apr 2024 02:58 IST

విశాఖ పోలీసులకు తెదేపా ఫిర్యాదు

విశాఖపట్నం (గాజువాక), న్యూస్‌టుడే: విశాఖలోని గాజువాకలో ఆదివారం రాత్రి తెదేపా ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పార్టీ అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు. గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్‌, పల్లా శ్రీనివాస్‌ తదితరులు సోమవారం విశాఖ సౌత్‌ ఏసీపీ టి.త్రినాథ్‌, గాజువాక సీఐ శ్రీనివాసరావును కలిసి ఈ మేరకు ఫిర్యాదు అందించారు. ఈ దిశగా ఇప్పటికే విచారణ చేపట్టామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ త్రినాథ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు