కంటోన్మెంట్‌ భాజపా అభ్యర్థిగా వంశ తిలక్‌

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా టీఎన్‌ వంశ తిలక్‌ను ఆ పార్టీ కేంద్ర కమిటీ మంగళవారం ఖరారు చేసింది.

Published : 17 Apr 2024 04:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా టీఎన్‌ వంశ తిలక్‌ను ఆ పార్టీ కేంద్ర కమిటీ మంగళవారం ఖరారు చేసింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత టి.వి.నారాయణ, మాజీ మంత్రి టీఎన్‌ సదాలక్ష్మి దంపతుల కుమారుడు వంశ తిలక్‌. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత మృతితో వచ్చే నెల 13న ఉపఎన్నిక జరగనుంది. గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసిన శ్రీగణేశ్‌ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. భారాస అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న రెండో కుమార్తె నివేదిత పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని